వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయుల డేటా చోరీకి సంబంధించి సీబీఐకి స్పందించిన ఫేస్‌బుక్,కేంబ్రిడ్జి అనలిటికా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: గతకొద్దిరోజులుగా డేటా చోరీ అంశం తెలుగురాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతేడాది భారత్‌లో డేటా చోరీ భారీగా జరిగిందని సోషల్ మీడియా నుంచి వ్యక్తిగత సమాచారం దొంగలించడం జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి. ఫేస్‌బుక్ నుంచి సమాచారం సేకరించి భారత్‌లోని ఓ రాజకీయ పార్టీకోసం కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ పనిచేస్తోందన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణ సందర్భంగాఫేస్‌బుక్, కేంబ్రిడ్జి అనలిటికా సంస్థలను సీబీఐ సమాచారం కోరగా రెండు సంస్థలు స్పందించాయి.

Facebook, Cambridge Analytica responds to CBI over data theft of Indians

భారతీయుల వ్యక్తిగత డేటాను దొంగలించిదని కేంబ్రిడ్జ్ అనలిటికా పై ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణ చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేయడంతో ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాల్సిందిగా సీబీఐ ఆ సంస్థలను కోరడంతో అవి స్పందించాయని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కేంబ్రిడ్జ్ అనలిటికా పై విచారణ చేసి సాక్షాధారాలు సంపాదించి ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది సీబీఐ.

మొన్నటివరకు ఛీ అన్నారు... నేడు వాటేసుకున్నారు: అస్సోంలో బీజేపీ ఏజీపీ పొత్తు ఖరారుమొన్నటివరకు ఛీ అన్నారు... నేడు వాటేసుకున్నారు: అస్సోంలో బీజేపీ ఏజీపీ పొత్తు ఖరారు

ఇక సోషల్ మీడియా నుంచి భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంను దొంగలించడం ప్రైవసీ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. డేటాను చోరీ చేసి వ్యక్తుల అనుమతి తీసుకోకుండా ఓ రాజకీయ పార్టీకి సమాచారంను చేరవేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తద్వారా భారత ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇది విజిల్ బ్లోవర్ క్రిస్టోఫర్ వైలీ బయటపెట్టడంతో ఇది వెలుగు చూసింది. భారత్‌లో ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తృతంగా చేపడుతోందని కూడా క్రిస్టఫర్ బ్రిటీష్ పార్లమెంటరీ కమిటీకి తెలిపారు.

ఇక కేంబ్రిడ్జి అనలిటికా మాతృసంస్థ ఎస్‌సీఎల్ గ్రూపు ప్రధాన కార్యాలయం ఘజియాబాదులోని ఇందిరాపురంలో ఉందని... ఇక ప్రాంతీయ కార్యాలయాలు హైదరాబాదు, అహ్మదాబాదు, బెంగళూరు, కటక్, గౌహతి, ఇండోర్, కోల్‌కతా, పాట్నా, పూణేలలో ఉన్నాయని విజిల్ బ్లోవర్ క్రిస్టోఫర్ గతేడాది మార్చిలో ట్వీట్ చేశారు.

English summary
The Central Bureau of Investigation (CBI) has received a response from Facebook and Cambridge Analytica in the alleged data theft case. The agency has again approached both the organisations for more information in regards to the case.In September last year, Minister of Information and Broadcasting Ravi Shankar Prasad had asked CBI to look into the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X