facebook: అంకితా అదుర్స్, సొల్లు కార్చుకున్న నాయర్, రాజస్థాన్ లో స్కెచ్, కేరళలో, ఆంటీలు, అమ్మాయిలు !
కొచ్చి/ తిరువనంతపురం/ జైపూర్: నకిలి ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో అందమైన కాలేజ్ అమ్మాయిలు, అదిరిపోయే ఆంటీల ఫోటోలు పెడుతూ అమ్మాయిల పిచ్చి ఉన్న వాళ్లను వలలో వేసుకుని హనీట్రాప్ తో నిలువు దోపిడీ చేస్తున్న గ్యాంగ్ లోని ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ లో కుర్చుని కాలేజ్ అమ్మాయి అంకి శర్మా పేరుతో హాట్ హాట్ ఫోటోలు పెట్టి కేరళలో హనీట్రాప్ చేస్తున్న ముఠాలోని మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిక్కినంత చిక్కని అంటూ డబ్బులు లాగేస్తున్నారని, ఇలా మోసాలు జరుగుతున్న మొబైల్ ఫోన్లలో మహిళల తియ్యటి మాటలు వింటూ ఇలా మోసపోతూ మాకు తలనొప్పి తెస్తున్నారని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!
అంకిత శర్మా హాట్ ఫోటోలు
ఫేస్ బుక్ లో అంకిత శర్మా అనే అమ్మాయి హాట్ ఫోటోలు కనపడ్డాయి. అంకిత శర్మా కాలేజ్ లో చదువుతున్నదని సోషల్ మీడియాలో వివరాలు ఉన్నాయి. కేరళలోని తిరువనంతపురంకు చెందిన నాయర్ అనే తిక్కలోడు అంకిత శర్మా హాట్ ఫోటోలు చూసి సోల్లు కార్చుకున్నాడు. వెంటనే అకింత శర్మాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఆమెతో పరిచయం పెంచుకోవాలని ఆశపడ్డాడు.
రెచ్చగొట్టే మాటలు...హాట్ హాట్ డైలాగులు
ఫేస్ బుక్ ఫ్రెండ్ గా నువ్వు ఓకే అంటూ అంకితా శర్మా నుంచి రెస్పాన్స్ రావడంతో నాయర్ ఎగిరిగంతేశాడు. అంతే కొంతకాలం ఫేస్ బుక్ లో టచ్ లో ఉన్న నాయర్, అంకిత శర్మా తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. మగాళ్లను రెచ్చగొట్టే మాటలతో అంకిత శర్మా మొదట నాయర్ ను రెచ్చగొట్టింది. తరువాత అసలు కథ మొదలు పెట్టారు.
నాయర్ ను నాకించేసి డబ్బులు స్వాహా
తనకు డబ్బులు అవసరంగా ఉందని, కొంచెం సహాయం చెయ్యాలని అంకిత శర్మా నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఓసి అంతేనా అంటూ పోటుగాడు నాయర్ రూ. 10, 000తో మొదలు పెట్టి తరువాత ఆ అమ్మాయి చెప్పిన అకౌంట్ కు అడిగినంత డబ్బులు గూగుల్ పే ద్వారా పంపించాడు. తరువాత కొంతకాలానికి నేను నీతో మాట్లాడనని, నువ్వు నన్ను ఇబ్బంది పెడితే నువ్వు నాతో అసభ్యంగా మాట్లాడావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని నాయర్ కు అవతలి నుంచి బెదిరింపు ఫోన్ లు వచ్చాయి.
ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తుందో ?
అమ్మాయి నుంచి బెదిరింపు ఫోన్లు రావడంతో హడలిపోయిన నాయర్ ఇది ఎక్కడికిపోయి ఎక్కడికి వస్తుందో ?, నా మీద ఏమైనా రివర్స్ కేసు పెడుతారో అనే భయంతో తిరునంతపురం (త్రివేండ్రం) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫేస్ బుక్ అకౌంట్, గూగుల్ పే అకౌంట్, ఇ మెయిల్ అడ్రస్ ఆధారంగా నిందితులు రాజస్థాన్ లో ఉన్నారని గుర్తించారు.
Recommended Video
రాజస్థాన్ లో పోటుగాళ్లు
కేరళ పోలీసులు రాజస్థాన్ వెళ్లి స్థానిక పోలీసుల సహాయంతో కమన్ ప్రాంతానికి చెందిన సుఖదేవ్ సింగ్ (26), నహర్ సింగ్ (34) అనే ఇద్దరిని అరెస్టు చేశారు. అమ్మాయిలు, ఆంటీల ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి ఇలా అమ్మాయి పిచ్చి ఉన్న వాళ్లను నిలువునా నాకించేస్తున్న ఈ ముఠాలోని మిగిలిన నిందితుల ఆచూకి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. పదేపదే సోషల్ మీడియాలో ఇలాంటి మోసాలు జరుగుతున్నా మళ్లీమళ్లీ ఇలాగే యువకులు మోసపోతున్నారని, మాకు లేనిపోని తలనొప్పులు తెస్తున్నారని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.