ఆ ఎంపీ నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు, సీడీ కూడ ఉంది: మహిళ ఆరోపణ
గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ ఎంపిని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ సంచలన ఆరోపణలు చేశారు.ఆ ఎంపి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ప్రకటించారు.
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ ఎంపిని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ సంచలన ఆరోపణలు చేశారు.ఆ ఎంపి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ప్రకటించారు. ఈ మేరకు తనవద్ద సీడీ ఉందని ఆమె ప్రకటించారు.
అయితే తనను మాయలేడి ట్రాప్ చేసిందని ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను అభ్యంతరకరంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోందని ఆ మహిళపై ఎంపీ న్యూఢిల్లీ పోలీసులకు పిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మహిళ ఇంటిని గుర్తించారు. ఆ ఇంటిపై దాడి చేశారు.అయితే ఆమె అప్పటికే ఆ ఇంటి నుండి పారిపోయింది. నెల రోజుల క్రితం హర్యానా రాష్ట్రానికి చెందిన ఎంపీపై అత్యాచార ఆరోపణలు చేస్తూ ఆ మాయాలేడీ కేసు పెట్టింది.
అయితే ఈ కేసును ఆమె తర్వాత ఉపసంహరించుకొందని ఢిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ ముఖేష్ మీనా చెప్పారు. ఈ కేసును ఎందుకు ఆమె ఉపసంహరించుకొందో కూడ దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఆ మాయాలేడీ బ్లాక్ మెయిల్ కేసు అని అయితే గుజరాత్ కు చెందిన ఎంపీపై అత్యాచారం కేసు నమోదు చేయలేదని కమిషనర్ వివరించారు. పోలీసులు కిలాడీ లేడీ ఫోన్ కాల్స్ పై నిఘా ఏర్పాటు చేసి ఆమె వివరాలను రాబట్టే పనిలో పడ్డారు.