వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact check: ఈగలతో కరోనా వైరస్, 2 నిమిషాల వీడియోలో అమితాబ్, తోసిపుచ్చిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ ఎలా ఆవిర్భవించిందో అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. వైరస్ కోసం వ్యాక్సిన్ కనుగొనేందుకు 18 నెలలు పడుతోందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితై కరోనా గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూసింది. కరోనా వైరస్ ముడితే, లేదంటే తుమ్మితే వస్తోందని మనకు తెలుసు.. కానీ ఈగల వల్ల కూడా వస్తోందని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. దీంతో ఈగల వల్ల వైరస్ సోకుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో వన్ ఇండియా నిజ నిజాలపై ఫ్యాక్ట్ చెక్ చేపట్టింది.

ఈగల వల్ల..

ఈగల వల్ల..

కరోనా వైరస్ కొన్ని వారాలపాటు ప్రభావం చూపుతుందని, మానవ విసర్జనపై ఈగలు వాలితే ప్రమాదం అని హెచ్చరించారు. అవి మనం తినే ఆహార పదార్థాల మీద వాలాయో ఇక అంతే సంగతులు.. ఆ భోజనం తీసుకున్న వారకి వైరస్ వస్తోందని చెప్పారు. ఈ మేరకు 2 నిమిషాల నిడివిగల వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్యాగ్ చేశారు.

పరిశోధన ఏం చెప్పిందంటే..

పరిశోధన ఏం చెప్పిందంటే..

లాన్సెట్ పరిశోధనను వీడియోలో అమితాబ్ బచ్చన్ వివరించారు. ప్రతీ ఒక్కరు విధిగా మరుగుదొడ్డి ఉపయోగించాలని కోరారు. అలాగే మరుగుదొడ్డి ఉపయోగించాక డోర్ వేయాలని.. ఈగలు రాకుండా అడ్డుకోవాలని సూచించారు. మలంపై ఉన్న ఈగల ద్వారా శ్వాసకోస నాళాలపై ప్రభావం చూపుతోందని తెలిపారు. అందుకోసమే ప్రతీ ఒక్కరు మరుగుదొడ్డి ఉపయోగించాలని కోరారు. దీనిపై దేశం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు.

 ప్రమాదం..

ప్రమాదం..

మలం మీద వాలిన ఈగలు ఎక్కువ కాలం జీవించి ఉంటాయని, దీనిని జర్నల్ పరిశోధనలో కూడా తేలిందని అమితాబ్ బచ్చన్ తెలిపారు. కరోనా వైరస్ నుంచి వ్యక్తి కోలుకున్నాక కూడా వైరస్ ప్రభావం ఉంటుందని, అధ్యయనం తేలిందని అమితాబ్ వెల్లడించారు. అధ్యయనం వైరస్‌తోపాటు పారిశుద్ద్యం, సామాజిక దూరం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుందన్నారు. దేశంలో చాలామంది మరుగుదొడ్డి ఉపయోగించడం లేదని.. దీంతో ప్రమాదం పొంచి ఉందనే అమితాబ్ బచ్చన్ ఆందోళన వ్యక్తం చేశారు.

అదేం లేదే..

అదేం లేదే..

అమితాబ్ బచ్చన్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత.. ఈగల ద్వారా కూడా వైరస్ సోకుతుందని చైనా చేసిన అధ్యయనం ద్వారా తేలిందని ట్రోల్ అవుతోంది. దీనిని భారత ప్రభుత్వం కూడా ధృవీకరించిందని.. దానికి ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్ నియమించారని ట్రోల్ అవుతోంది. అమితాబ్ బచ్చన్ చేసిన వీడియోపై కేంద్రం స్పందించింది. కరోనా వైరస్ అంటు వ్యాధి అని వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టంచేశారు. ఈగల ద్వారా వ్యాపించబోదని తేల్చిచెప్పారు. ఈగలు ద్వారా వైరస్ సోకదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా స్పష్టంచేసింది.

English summary
Bollywood actor Amitabh Bachan has warned that the novel coronavirus can spread quickly as the virus remains active for weeks in human excreta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X