మాయాలేడీ: టెక్కీనంటూ 9 పెళ్ళిళ్ళు, ఎక్కడంటే?
టెక్కీగా పనిచేస్తున్నాను. భర్తను కోల్పోయానని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి పదో పెళ్ళికి సిద్దమైంది ఓ యువతి.
తిరువనంతపురం: టెక్కీగా పనిచేస్తున్నాను. భర్తను కోల్పోయానని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి పదో పెళ్ళికి సిద్దమైంది ఓ యువతి. అయితే పదో పెళ్ళికి హజరైన పెళ్ళికొడుకు స్నేహితుడు వధువును గుర్తించడంతో ఆమె అసలు బాగోతం బయటపడింది.దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
కేరళ రాష్ట్రంలో ఓ కిలాడీ లేడీ పదిమందిని మోసం చేసింది. టెక్కీగా పనిచేస్తున్నానని వార్తా పత్రికల్లో ప్రకటనలిచ్చి వివాహం చేసుకోవడం , పెళ్ళిరోజే నగదు, నగలతో జంప్ అయ్యేది. అయితే ఎట్టకేలకు ఆమె మోసాలకు తెరపడింది. పదో పెళ్ళికొడుకు ఆమె చేతిలో బలికాకుండా తప్పించుకొన్నాడు.
భర్తను కోల్పోయిన వధువును పెళ్ళిచేసుకొనేందుకు వరుడు కావాలని షాలిని ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానని ప్రకటించింది.
ఈ ప్రకటనను చూసిన ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. అయితే తన భర్తను కోల్పోయానని సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని అతడిని నమ్మించింది. దీంతో ఆమెను వివాహం చేసుకొనేందుకు అతను సమ్మతించాడు.
అయితే ఈ పెళ్ళికి వరుడి స్నేహితులు, బంధువులు మాత్రమే హజరయ్యారు. వధువు తరపువారెవ్వరూ కూడ హజరుకాలేదు. వరుడు తరపున పెళ్ళికొచ్చిన ఓ స్నేహితుడు ఫోన్ లో మరో వ్యక్తికి ఫోన్ చేశాడు.
అయితే అతను కూడ ఈ వివాహనికి వచ్చాడు. వధువుగా మారిన షాలిని బండారాన్ని అతను కనిపెట్టాడు. షాలిని చేతిలో మోసపోయిన వ్యక్తి ఆమె బండారాన్ని పెళ్ళి మండపంలోనే బయటపెట్టాడు. దీంతో ఆమె పదోపెళ్ళి చేసుకోకుండానే ఆగిపోయింది.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలిపై ఇప్పటికే ఐదు కేసులున్నట్టుగా పోలీసులు చెప్పారు. ఆమెను అరెస్టు చేసి దర్యాప్తుకు పంపారు.