ఐఫోన్ రూ. 599లకే.. వెబ్సైట్ మోసం, అరెస్టు(ఫోటోలు)
బెంగుళూరు: ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా.. ? ఐతే వినియోగదారులూ కాస్త జాగ్రత్త పడండి. ఇటీవల కాలంలో ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్న వారిని ఆయా వెబ్సైట్స్ మోసం చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కొత్త వెబ్సైట్ వచ్చి చేరింది. BIGSOP.com అనే వెబ్సైట్ ఐఫోన్ను రూ. 599లకే అంటూ బ్రౌజర్ పాప్అప్లతో ప్రకటనలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందంటూ ఫిర్యాదులు రావడంతో సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగుళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఈ వెబ్సైట్ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. BIGSOP.com పేరుతో మంచి వెబ్ సైట్ను రూపొందించి ఆన్ లైన్లో తమ ఉత్పత్తులను అమ్మకాలు జరుపుతుంది. ఇందుకు గాను ఐసీఐసీఐ బ్యాంక్ గేట్ వే వినియోగించి కస్టమర్లను ఆకర్షిస్తుంది.
ఐఫోన్ కేవలం రూ. 599లకే నంటూ వినియోగదారులను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించి... ముందుగానే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఎవరైతే కస్టమర్లు రిజస్టర్ చేసుకుని డబ్బుని చెల్లించారో వారికి ఐఫోన్ రాకపోవడంతో శనివారం నాడు ట్విట్టర్ ద్వారా సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
దాంతో సీసీబీ పోలీసులు BIGSOP.com వెబ్ సైట్ ఎక్కడి నుంచి పని చేస్తుందో గుర్తించి మెరుపు దాడులు చేసి... ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కస్టమర్లతో మాట్లాడేందుకు గాను ప్రత్యేకించి కొంత మందిని నియమించుకుని బీపీఓ కూడా రన్ చేస్తున్నారు.
ఐఫోన్ రూ. 599లకే.. వెబ్సైట్ మోసం, అరెస్టు
తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కొత్త వెబ్సైట్ వచ్చి చేరింది. BIGSOP.com అనే వెబ్సైట్ ఐఫోన్ను రూ. 599లకే అంటూ బ్రౌజర్ పాప్అప్లతో ప్రకటనలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందంటూ ఫిర్యాదులు రావడంతో సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐఫోన్ రూ. 599లకే.. వెబ్సైట్ మోసం, అరెస్టు
పోలీసులు
తెలిపిన
వివరాల
ప్రకారం
బెంగుళూరు
నగరంలోని
హెచ్ఎస్ఆర్
లేఅవుట్లో
ఈ
వెబ్సైట్
తన
కార్యకలాపాలను
నిర్వహిస్తుంది.
BIGSOP.com
పేరుతో
మంచి
వెబ్
సైట్ను
రూపొందించి
ఆన్
లైన్లో
తమ
ఉత్పత్తులను
అమ్మకాలు
జరుపుతుంది.
ఇందుకు
గాను
ఐసీఐసీఐ
బ్యాంక్
గేట్
వే
వినియోగించి
కస్టమర్లను
ఆకర్షిస్తుంది.
ఐఫోన్ రూ. 599లకే.. వెబ్సైట్ మోసం, అరెస్టు
ఐఫోన్ కేవలం రూ. 599లకే నంటూ వినియోగదారులను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించి... ముందుగానే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఎవరైతే కస్టమర్లు రిజస్టర్ చేసుకుని డబ్బుని చెల్లించారో వారికి ఐఫోన్ రాకపోవడంతో శనివారం నాడు ట్విట్టర్ ద్వారా సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఐఫోన్ రూ. 599లకే.. వెబ్సైట్ మోసం, అరెస్టు
ఐఫోన్ కేవలం రూ. 599లకే నంటూ వినియోగదారులను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించి... ముందుగానే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఎవరైతే కస్టమర్లు రిజస్టర్ చేసుకుని డబ్బుని చెల్లించారో వారికి ఐఫోన్ రాకపోవడంతో శనివారం నాడు ట్విట్టర్ ద్వారా సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.