వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ హయాంలో తగ్గిన ఆహార ఉత్పత్తుల ధరలు

|
Google Oneindia TeluguNews

గత కొన్ని నెలలుగా ఆహార ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచగలిగింది. అయితే ఈ ధరల తగ్గుదలతో బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది .ముఖ్యంగా ఖర్చుల వివరాలు చెప్పాల్సినప్పుడు ఈ ఇబ్బందులను ఎదుర్కొంది. మంచి పంట పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పట్టాయి. ధరలు తగ్గుదలతో ద్రవ్యోల్బణం తగ్గటం అంటే రైతులకు ప్రభుత్వం కొన్ని పంటలపై పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు కంకణం కట్టుకుంది. అంతేకాదు 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోడీ పనిచేస్తున్నారు.

ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే అది వినియోగదారులకు మేలు చేకూర్చుతుంది. వరి, పాలు, నూనెగింజల ద్రవ్యోల్భణం తగ్గిపోగా... ధాన్యాలుచ గోధుమలు, ఆలూ ద్రవ్యోల్బణం వరసగా 5.54శాతం, 8.87శాతం,80.13శాతంగా పెరిగినట్లు గతవారం విడుదలైన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి, గుడ్ల, మాంసాహారలపై ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ముడిచమురు ధరల్లో పెరుగుదల కనిపించడంతో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని అంతా భావించారు. ఆయిల్ ధరలు పెరిగిన లేదా తగ్గినా దానికి అనుగుణంగానే ద్రవ్యోల్బణం కూడా ఉంటుంది. ముడిచమురు ధరలు పెరిగితే ఇది ఆర్థిక వ్యవస్థలోని ఆర్థికలోటు, ప్రస్తుత ఖాతా లోటులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తద్వారా మోనిటరీ విధానాలు, పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది.

Falling food prices: A double edged sword

ద్రవ్యోల్బణం గురించి ఇంకా సులభంగా వివరించాలంటే మార్కెట్ ధరలపై ప్రభావం చూపేదిగా చెప్పొచ్చు. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే ప్రభుత్వం ధరలు నియంత్రణలో సఫలమైందని అర్థం. ఇది వినియోగదారులకు మేలు చేకూర్చేదే అయినా ఖర్చుల పరంగా ప్రభుత్వానికి సమస్య కలిగించేదని చెప్పొచ్చు. భారత హోల్ సేల్ ధరల సూచిక సెప్టెంబర్ 2018లో 5.13శాతానికి చేరింది. ఇది ఆగష్టులో 4.53శాతంగా ఉన్నింది. సెప్టెంబర్ క్వార్టర్ ముగిసే సమయానికి హోల్ సేల్ ధరల సూచికలో 4.98శాతం వార్షిక పెరుగుదల నమోదు చేసుకుంది. మరోవైపు వినియోగదారుడి ధర సూచిక 3.88శాతానికి పెరిగింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్‌సేల్ ధరల సూచిక ద్వారా నమోదయ్యే ద్రవ్యోల్బణంనే పరిగణలోకి తీసుకుని మోనిటరీ విధానాలను అంచనా వేస్తుంది. ఇప్పుడు మాత్రం వినియోగదారుడి ధరల సూచిక ద్రవ్యోల్బణంనే పరిగణలోకి తీసుకుంటోంది.

English summary
Fall in food prices in the past few months may have helped the government to keep the inflation under check, but it also presents a budgetary problem to the policy makers in terms of spending.Good harvest and increased farm output, which have kept the food prices down, is in a way double edged sword. The subdued inflation numbers due to low food prices means that the government will have to shell out more to compensate farmers for low market prices of some crops. The government is committed to this due to its MSP policy and PM Modi's aim to double farm incomes by 2022.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X