Family: భర్త, భార్య, కూతురిని నరికి చంపేసి ?, భర్తకు శత్రువులు, రాత్రి ఏం జరిగింది ?
ఛత్తీస్ గఢ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతుల కుమార్తె కాలేజ్ లో చదువుతోంది. భర్త వ్యాపారం చేస్తున్నాడు. భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. రాత్రి భోజనం చేసిన దంపతులు, వారి కుమార్తె రాత్రి ఇంట్లో టీవీ చూశారు. మరుసటి రోజు మద్యాహ్నం అయినా దంపతులతో పాటు వాళ్ల కుమార్తె ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. దంపతుల ఇంటికి వెళ్లి తలుపులు తీసి చూడా దంపతులతో పాటు వారి కుమార్తె దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూడటం కలకలం రేపింది.
Crime: బెంగళూరులో భర్త, బడిలో కూతురు, ఒడిలో ప్రియుడు, ఏం నాటకాలు ఆడిందిరా సామి, క్లైమాక్స్ !
కాలేజ్ లో చదువుతున్న కూతురు
ఛత్తీస్ గఢ్ లోని జష్ పూర్ జిల్లాలోని కడమ్ తోలి గ్రామంలో అర్జున్ టెండువా (44), ఫిర్ని టెండువా (40) అనే మహిళ 20 సంవత్సరాల క్రితం వివాహం చేసుసుకున్నారు. వివాహం చేసుకున్న అర్జున్, ఫిర్ని దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. అర్జున్, ఫిర్ని దంపతుల కుమార్తె సంజనా (19) కాలేజ్ లో చదువుతోంది.
రాత్రి సంతోషంగా ఉన్నారు
అర్జున్ వ్యాపారం చేస్తున్నాడు. అర్జున్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. రాత్రి భోజనం చేసిన అర్జున్, ఫిర్ని దంపతులు, వారి కుమార్తె సంజనా రాత్రి ఇంట్లో టీవీ చూస్తున్న విషయం చుట్టుపక్కల వాళ్లు గమనించారు. మరుసటి రోజు మద్యాహ్నం అయినా అర్జున్, ఫిర్ని దంపతులతో పాటు వాళ్ల కుమార్తె పంజనా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది.
ముగ్గురిని వేటకొడవళ్లతో నరికేశారు
అర్జున్, ఫిర్ని దంపతుల ఇంటికి వెళ్లిన బంధువులు చాలాసేపు తలుపులు తట్టినా ఎవ్వరూ పలకలేదు. తలుపులు లాక్ చెయ్యకపోవడంతో వాటిని ముందుకు తోసిచూడగా అర్జున్, ఫిర్ని దంపతులతో పాటు వారి కుమార్తె సంజనా దారుణ హత్యకు గురైన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అర్జున్ కు శత్రువులు ఎక్కువ
అర్జున్ కు చాలా మంది శత్రువులు ఉన్నారని, ఓ విషయంలో అర్జున్ కొందరితో గొడవపడుతున్నాడని వెలుగు చూసిందని, కొందరిని అదుపులోకి తీసుకుని విచారన చేస్తున్నామని జష్ పూర్ జిల్లా ఎస్పీ డి. రవిశంకర్ స్థానిక మీడియాకు చెప్పారు. ఒకే ఇంటిలో ముగ్గురు దారుణ హత్యకు గురికావడం ఛత్తీస్ గఢ్ లో కలకలం రేపింది.