మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం: ముగిసిన ప్రక్రియ
న్యూఢిల్లీ: దేశంలో ఇక మూడు వ్యవసాయ చట్టాలు ముగిసిన అధ్యయంగా మారాయి. బుధవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. నవంబర్ 29నే పార్లమెంటులోని లోక్సభ, రాజ్యసభలోనూ ఈ రద్దు బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. తాజాగా, రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో మూడు వ్యవసాయ చట్టాలు రద్దు ప్రక్రియ పూర్తయింది.
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021, పంటల అమ్మకం, ధర, నిల్వకు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడానికి గత సంవత్సరం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరింది, దీనిని లోక్సభ నిమిషాల్లో ఆమోదించింది, ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది. రాజ్యసభలోనూ వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది.
ధరల భరోసా, వ్యవసాయ సేవల చట్టం, 2020పై రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పందం, నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం, 2020, రైతుల ఉత్పత్తి వాణిజ్యం, వాణిజ్య (ప్రోత్సాహం, సులభతరం) చట్టం, 2020.. రైతుల్లో భారీ గందరగోళాన్ని రేకెత్తించాయి. ప్రత్యేకించి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రైతులు గత ఏడాది కాలంగా నిరసనలు కొనసాగిస్తున్నారు.
#FarmLaws | Act may be called Farm Laws Repeal Act, 2021. Farmers (Empowerment&Protection) Agreement on Price Assurance&Farm Services Act, 2020, Farmers' Produce Trade&Commerce (Promotion & Facilitation) Act, 2020 & Essential Commodities (Amendment) Act, 2020 are hereby repealed. pic.twitter.com/8JHvEs34bR
— ANI (@ANI) December 1, 2021
ఇదిలావుండగా, వ్యవసాయ చట్టాలపై జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 కోట్లు పరిహారంగా అందించాలని, కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీతో సహా రైతుల ఇతర డిమాండ్లను కూడా ఆమోదించాలని కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ బుధవారం డిమాండ్ చేశారు.
Recommended Video
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 19న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.