వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు సంఘాలకు క్లారిటీ లేదు -అందుకే పరిష్కారం కుదరట్లేదన్న తోమర్-సుప్రీం కమిటీకి స్వాగతం

|
Google Oneindia TeluguNews

నిరసనలు చేస్తోన్న రైతులకు సాగు చట్టాల విషయంలో క్లారిటీ కొరవడిందని, ప్రతిపాదనల విషయంలో రైతు సంఘాల నేతల అవగాహనలేమి వల్ల చర్చలు ముందుకు సాగడంలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆక్షేపించారు. కనీసం తర్వాతి దశ చర్చల్లోనైనా రైతుల నిర్ణయాత్మక ప్రతిపాదనలతో ముందుకు రావాలన్నారు. రైతు సంఘాలతో శుక్రవారం తొమ్మిదో దశ చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు..

సుప్రీం కోర్టు కమిటీ వద్దకు వెళ్లం.. కేంద్రంతోనే చర్చలు జరుపుతాం: రైతు సంఘాల స్పష్టీకరణసుప్రీం కోర్టు కమిటీ వద్దకు వెళ్లం.. కేంద్రంతోనే చర్చలు జరుపుతాం: రైతు సంఘాల స్పష్టీకరణ

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా శుక్రవారం జరిగిన తొమ్మిదో రౌండ్ చర్చలు నిర్ణయాత్మకంగా జరగలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. 19న మరోసారి చర్చలు జరపనున్నట్టు చెప్పారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చలి వాతావరణంలో రైతులు నిరసనలు తెలపడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు..

Farm laws stir: Govt wants farmers to prepare concrete proposals says minister Tomar

సాగు చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కేంద్ర మంత్రి తొలిసారి స్పందించారు. సుప్రీంతీర్పును కేంద్రం స్వాగతిస్తున్నదని, సమస్య పరిష్కారం దిశగా రెండు పక్షాలతో సంప్రదింపుల కోసం సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీని స్వాగతిస్తున్నామని తోమర్ అన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పిలిచినప్పుడు తమ వైపు నుంచి హాజరవుతామన్నారు. రైతు సంఘాల నేతలు మాత్రం సుప్రీం కమిటీ ముందుకు వెళ్ళబోమని, కేంద్రంతోనే అమీ తుమీ తేల్చుకుంటామన్నారు. ఇక..

Farm laws stir: Govt wants farmers to prepare concrete proposals says minister Tomar

బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తేబీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తే

రైతులతో కేంద్రం 9వ రౌండ్ చర్చలు జరిపిన శుక్రవారమే.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ చేపట్టడం, ఆ ర్యాలీలో రాహల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొనడంపై కేంద్ర మంత్రి తోమర స్పందించారు. రాహుల్ గాంధీ ప్రకటనలు, చర్యలు చూసి సొంత పార్టీ వాళ్లే నవ్వుకుంటున్నారని తోమర్ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ చట్టాలను తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని మరోసారి గుర్తు చేసుకోవాలని తోమర్ విమర్శించారు.

English summary
Urging farmer unions to form an informal group among themselves to prepare concrete proposals to be discussed in the next meeting, Agriculture Minister Narendra Singh Tomar said on Friday detailed discussions took place at the ninth round of talks but could not reach a decisive stage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X