నేడు సుప్రీంకోర్టుకు కిసాన్ యూనియన్, ఢిల్లీ-జైపూర్ హైవే దిగ్బంధనం..
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు వారాల నుంచి నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. వ్యవసాయ చట్టాలు/ మద్దతు ధర ఇతర అంశాలపై రైతు ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. అయితే ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో అన్ సక్సెస్పుల్గా మిగిలాయి.
డిమాండ్లపై ఆందోళన చేస్తున్న ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని రైతు నేతలు భావిస్తున్నారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెబుతోంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ బిల్లులను చట్టాలు చేశారని పేర్కొంటారు. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం రైతు ప్రతినిధులుతో జరుపుతున్న చర్చలు విఫలమవుతున్నాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అంటున్నారు.
Recommended Video
మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒంటికాలిపై లేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నామనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనను.. ఖండించారు. ప్రభుత్వ తీరు డబుల్ చేయడం కాదు.. బీహర్ రైతుల స్థాయికి తీసుకెళ్లడం అంటూ ధ్వజమెత్తారు.