వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు కేంద్ర మంత్రి బహిరంగ లేఖ -నిరసనలపై ఆగ్రహం -మద్దతు ధరపై హామీ ఇస్తామన్న తోమర్

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారంతో నిరసనలు 22వ రోజుకు చేరగా, ఉమ్మడి అజెండా ఖరారులో తకరారు తలెత్తడంతో రైతులు-కేంద్రం మధ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక అడుగు వేశారు..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం రాత్రి రైతులకు బహిరంగ లేఖ రాశారు. మొత్తం ఎనిమిది పేజీలతో కూడిన ఆ లేఖలో.. రైతుల నిరసనల వల్ల అనేక సమస్యలు తలెత్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనలపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే, కొత్తగా పలు రకాల హామీలను సైతం తోమర్ తన లేఖలో రాసుకొచ్చారు.

జగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా -మా సీఎం కంటే ఎక్కువ -పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలనంజగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా -మా సీఎం కంటే ఎక్కువ -పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలనం

పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కొన్ని పార్టీలు, యూనియన్లకు చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, రైతులెవరూ అలాంటి ప్రచారాన్ని నమ్మోద్దని లేఖలో రైతులకు మంత్రి విజ్ణప్తి చేశారు. ఎంఎస్‌పీపై ప్రభుత్వం లిఖితపూర్వకమైన హామీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Farmers Protest Updates: agri minister Tomar writes 8-page open letter to farmers

''కొన్ని రైతులు సంఘాలు తప్పుడు ప్రచారం, రూమర్లను ప్రచారం చేస్తున్నాయి. అలాంటి వారిని బయటికి పంపడం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినందుకు నా బాధ్యత. వాళ్లు రైలు పట్టాలపై కూర్చొని రైళ్లను ఆపుతున్నారు. దాని ద్వారా మన సైనికులు సరిహద్దుకు చేరుకోలేకపోతున్నారు'' అని రైతులకు రాసిన లేఖలో తోమర్ పేర్కొన్నారు.

పెళ్లి పేరుతో సెక్స్ -ప్రతిసారి నేరం కాబోదు -హైకోర్టు సంచలన తీర్పు - రేప్ కేసులో వ్యక్తి నిర్దోషిపెళ్లి పేరుతో సెక్స్ -ప్రతిసారి నేరం కాబోదు -హైకోర్టు సంచలన తీర్పు - రేప్ కేసులో వ్యక్తి నిర్దోషి

నిజానికి మంత్రి తోమర్ లేఖలో చెప్పిన ఎంఎస్‌పీపై హామీ అంశాన్ని ముందునుంచే ప్రతిపాదిస్తూ వస్తున్నా, అందుకు రైతులు అంగీకరించడంలేదు. వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిరసనల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని కేంద్రం అంటుండగా, సుప్రీంకోర్టు మాత్రం నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని చెప్పడం గమనార్హం.

English summary
Union Agriculture Minister Narendra Singh Tomar has written a letter to the protesting farmers, requesting them to not believe in the "white lies" being spread by some people that MSP will be stopped. He has urged the farmers to not believe in such lies. Earlier, Amit Shah, Piyush Goyal, Nirmala Sitharama and Narendra Singh Tomar had a meet at the BJP HQ along with party general secretaries on the farm laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X