వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్లుండి నిరాహార దీక్ష, కూలీలు, మహిళలు కలిసి రండి, కొనసాగుతోన్న రైతుల ఆందోళన..

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన కొనసాగుతూనే ఉంది. రైతు నేతలపై డిమాండ్లపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో రైతు నేతలు కూడా తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో వెంట ఆందోళనకు దిగారు. తమ కార్యాచరణకు ప్రకటించారు.

Recommended Video

Protesting Farmers To Centre : Will Block Railway Tracks

ఆదివారం ఉదయం 11 గంటలకు రాజస్తాన్‌లోని షాజహన్ పూర్ వద్ద ట్రాక్టర్ ర్యాలీ తీస్తామని రైతు నేత కమల్ ప్రీత్ సింగ్ పన్ను తెలిపారు. ఇదీ ఢిల్లీ-జైపూర్ హైవేను దిగ్బందిస్తుందని తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేయాల్సిందేనని.. రైతు నేతలు పట్టుబడుతున్నారు.

Farmers to block Delhi-Jaipur Highway, stage fast, issue call for labourers, women to join agitation

సోమవారం రోజున జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగుతామని చెప్పారు. తమతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దమయితే తాము కూడా రెడీ అని పేర్కొన్నారు. తమ ప్రధాన డిమాండ్ మాత్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు సవరణలు చేయడమేనని తెలిపారు. తమ నిరసనలకు కూలీలు, మహిళలు మద్దతు తెలుపాలని కూడా కోరారు.

English summary
Farmer leaders have decided to intensify the ongoing agitation against the Centre's three new farm laws
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X