వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రకోటపై సిక్కు జెండా జాతికి అవమానం -సీజేఐ సుమోటోగా -రైతుల ర్యాలిలో టెర్రర్ చర్యలంటూ

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తోన్న రైతులు.. మంగళవారం రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాయుతంగా ముగిసింది. పోలీసులు నిర్ధేశించిన రూట్లలో కాకుండా, ఇతర మార్గాల్లో ట్రాక్టర్లు దూసుకురావడం, వాటిని బలగాలు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఘర్షణ చెలరేగడం, ప్రమాదవశాత్తూ ఒక రైతు ప్రాణాలు కోల్పోయిన తర్వాత.. కొందరు ఎర్రకోటలోకి ప్రవేశించి సిక్కు మతానికి చెందిన జెండాలు ఎగరేయడం లాంటివి కలకలం రేపాయి. కాగా,

మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లేమదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లే

రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీ హింసాకాండ చోటుచేసుకుందని, దేశప్రతిష్ట దిగజారేలా కొనసాగిన అరాచకశక్తులు పేట్రేగిపోయాయని, వీటికి సంబంధించిన అన్ని అంశాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరుతూ డిమాండ్ వ్యక్తమైంది. ముంబై యూనివర్సిటీ న్యాయ విధ్యార్థిని అశిష్ రాయ్ మంగళవారం ఈ మేరకు సీజేఐ బోబ్డేకు లేఖ రాశారు.

farmers tractor rally: CJI urged to take cognisance of Delhi violence

జాతీయ చిహ్నామైన ఎర్రకోటపై జాతీయ జెండా స్థానంలో సిక్కు మతానికి చెందిన జెండాను ఎగరేయడం దేశాన్ని అవమానించడమేనని, అది కూడా రిపబ్లిక్ డే నాడు జరగడం రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించినట్లయిందని, పోలీసులపై దాడులు కూడా గర్హనీయమని, మొత్తం హింసాకాండపై సీజేఐ సుమోటోగా పరిశీలన జరపాలని రాయ్ లేఖలో కోరారు. ఇదిలా ఉంటే..

నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జలనిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జల

రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పలు చోట్ల ఘర్షణలు జరగ్గా, 18 మంది పోలీసులు గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో నగరంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదనపు బలగాలను దింపుతోంది. సుమారు 15 కంపెనీల పారామిలిటరీ దళాలను దిల్లీలో మోహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో దాదాపు 1500 మంది జవాన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. 10 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌, 5 కంపెనీల రెండవ తరహా.. పారామిలిటరీ బలగాలు మోహరించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా,

farmers tractor rally: CJI urged to take cognisance of Delhi violence

ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై రైతు సంఘాలు విచారం వ్యక్తంచేశాయి. సంఘ విద్రోహ శక్తులు తమ ర్యాలీలోకి ప్రవేశించాయని సంయుక్త కిసాన్‌ మోర్చా పేర్కొంది. ఎలాంటి హింసాత్మక చర్యలకు, జాతీయ చిహ్నాలు, గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించకూడదని ముందుగానే హెచ్చరించినట్టు రైతు నేతలు ప్రకటనలో తెలిపారు. హింస జరిగిన ప్రాంతాల్లో, ఎర్రకోటపై జెండా వ్యవహారంలో రైతులెవరూ పాలుపంచుకోలేదని వారు స్పష్టం చేశారు.

Recommended Video

Farmers Tractor Rally: Protesters Enter Delhi's Red Fort, Wave Their Flags From The Ramparts

English summary
A Mumbai-based law student Tuesday wrote a letter to the Chief Justice of India (CJI) S A Bobde urging him to take suo motu cognisance of the violence that took place at the Red Fort here during the farmers' tractor march on Republic Day. The letter, written by Mumbai University student Ashish Rai, claimed that the tractor march event has been 'terrorised by some anti-social elements'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X