వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు నీచమైన కుట్ర జరుగుతోందన్న రైతు సంఘాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

రైతు సంఘాలు బుధవారం నాడు బల్బీర్ సింగ్ రాజేవాల్ నాయకత్వంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా రైతు రిపబ్లిక్ డే పరేడ్‌కు ఊహించిని స్థాయిలో స్పందించిన రైతులందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు.

వ్యవసాయ చట్టాలకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనల్లో భాగమైన సంఘాల నేతలు దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల గురించి చర్చించారు. రైతులు చేపట్టిన ఈ ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసిందని వారన్నారు. అందుకే, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీతో పాటు మరికొన్ని వర్గాలతో కలిసి నీచమైన కుట్రకు పథకం పన్నారని వారు ఆరోపించారు. శాంతియుతంగా సాగుతున్న రైతుల ధర్నా మీద బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. వారెవరూ రైతు ఆందోళనను కలిసి కట్టుగా నడిపిస్తున్న సంఘాలకు చెందిన వారు కారని చెప్పారు.

సమావేశం అనంతరం చైర్మన్ బల్బీర్ సింగ్ రాజేవాల్‌తో పాటు జగ్‌జీత్ సింగ్ డల్లేవాల్, డాక్టర్ దర్శన్ పాల్ తదితర రైతు సంఘాల నాయకులు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

రైతుల ఆందోళన

"జనవరి 26న కిసాన్ పరేడ్ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించగానే, మాతో సంబంధం లేని ఆ రైతు సంఘంతో దీప్ సిద్ధు వంటి అసాంఘిక శక్తులు చేతులు కలిపి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. ఈ కుట్రలో భాగంగానే సదరు రైతు సంఘం వారు, మరికొందరు కలిసి రింగ్ రోడ్డు మీదుగా ప్రదర్శన నిర్వహించి ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తామని ప్రకటించారు. నిర్ణీత సమయానికి రెండు గంటలు ముందుగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ రింగ్ రోడ్ మీద ప్రదర్శన ప్రారంభించింది. ఇదంతా, శాంతియుతంగా సాగుతున్న రైతుల ఆందోళనను అణచివేసేందుకు జరిగిన లోతైన కుట్ర" అని ఆ ప్రకటనలో తెలిపారు.

సంయుక్త కిసాన్ మోర్చా కూటమిలోని సభ్య సంఘాలన్నీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయని కూడా వారన్నారు.

ఎర్రకోట వద్ద రైతుల నిరసనలు

"ఆందోళనలో భాగమైన రైతు సంఘాలకు చెందిన రైతులందరూ నిరసన ప్రదేశాలకు పరిమితమైన శాంతియుత ఆందోళన కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని చెప్పిన రైతు సంఘాల నాయకులు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం, పాలక యంత్రాంగం తీరును, రైతుల ఆందోళనను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన ఆ రైతు సంఘం చర్యలను వారు తీవ్రంగా ఖండించారు.

రిపబ్లిక్ డే నాటి ఘటనలతో రైతు వ్యతిరేక శక్తులెవరో తేటతెల్లమైందని ఈ సమాశం ప్రకటించింది. రైతు ఆందోళనల భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు బుధవాం నాడు జరిగిన ఈ సమావేశంలో 32 రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ కూడా దీప్ సిద్ధు సిక్కు కాదని, ఆయన బీజేపీ కార్యకర్త అని అన్నారు.

https://twitter.com/ANI/status/1354281236571639813

"ఆయన ప్రధానితో దిగిన ఫోటో కూడా బయటకు వచ్చింది. ఇది రైతుల ఉద్యమం. రైతు ఉద్యమంగానే కొనసాగుతుంది. బారికేడ్లను తోసుకుని వెళ్లిన వారంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Farmers' unions say there is a vicious conspiracy going on to suppress the peasant movement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X