ఉన్నావ్ బాధితురాలి తండ్రిపై దాడి, అంకుల్, పదేళ్ల చిన్నారికి బెదిరింపులు, ప్రియాంకగాంధీ
ఉన్నావ్ యువతిపై సాముహిక లైంగికదాడికి పాల్పడిన దుండగులు.. ఆమె కుటుంబాన్ని కూడా హింసించారు. గతేడాది డిసెంబర్లో దారుణానికి ఒడిగట్టిన నిందితులు, అప్పటినుంచి కుటుంబసభ్యులను కూడా బెదిరిస్తున్నారు. శనివారం వారిని పరామర్శించే సమయంలో తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపారు.
ఉన్నావ్ అత్యాచార ఘటన: నిరసనల సందర్భంగా ఆరేళ్ల కూతురుపై పెట్రోల్ పోసిన తల్లి
గతేడాది డిసెంబర్లో బాధితురాలిపై లైంగికదాడి చేశారు. తర్వాత కేసు నమోదు చేశారు. ఇటీవల రాయ్ బరేలి కోర్టుకు సాక్ష్యం చెప్పేందుకు వెళ్తుండగా నిలువరించి, దాడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించడంతో 90 శాతం గాయాలతో యువతి ఆస్పత్రిలో చేరింది. లక్నో నుంచి ఢిల్లీ తీసుకొచ్చిన ప్రయోజనం లేకపోయింది.
బాధితురాలి కుటుంబసభ్యులను కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ పరామర్శించారు. నిందితులు ఏడాది నుంచి తమను వేధిస్తున్నారని వారు పేర్కొన్నారు. యువతి తండ్రిపై చేయి చేసుకున్నారని తెలిసింది. ఆమె చినాన్న, పదేళ్ల వయస్సున్న చిన్నారిని బెదిరింపులకు గురిచేశారని ప్రియాంకకు వివరించారు. తమను వారు వేధిస్తున్న పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని వాపోయారు. యువతి కుటుంబానికి పోలీసులు భద్రత కల్పించకపోవడాన్ని ప్రియాంక తప్పుపట్టారు. ఉన్నావ్లోనే బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ మరో యువతిపై లైంగికదాడి చేసిన సంగతి తెలిసిందే.