వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతురిని చంపి శవం ముందు డ్యాన్స్ చేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

కాన్పూర్: భవిష్యత్తులో మంచి జరుగుతుందనే మూఢ విశ్వాసంతో ఓ వ్యక్తి తొమ్మిదేళ్ల కూతురిని చంపి శవం ముందు డ్యాన్స్ చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు సమీపంలో గల జగురా గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గిర్జేశ్‌పాల్ (40) సైకిల్ రిపేరింగ్ దుకాణం నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అతడికి ముగ్గురు పిల్లలు. శనివారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకొని గిర్జేశ్ భార్య బంధువుల ఇంటికి వెళ్లింది. తొమ్మిదేండ్ల చిన్నకూతురు ఖుషిని గిర్జేశ్ ఆరోజు తనవద్దే ఉంచుకున్నాడు. క్షుద్రశక్తులను సంతోషపెట్టడానికి అర్ధరాత్రి ఖుషిని కత్తితో పొడిచి చంపేసి అనంతరం శవాన్ని నట్టింట్లో పెట్టుకొని ప్రదక్షిణలు చేశాడు. డ్యాన్స్‌లు కూడా చేశాడు.

murder

ఆదివారం ఉదయం ఎప్పటిలాగే సైకిల్ రిపేరింగ్ పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇంటికి వచ్చిన భార్య కూతురు ఏదని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. పైగా ఇంట్లోకి ఎవరినీ రానివ్వలేదు. ఆందోళనకు గురైన ఆమె స్థానికుల సాయంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఖుషి రక్తపుమడుగుల్లో శవమై కనిపించింది.

పోలీసులు వచ్చి గిర్జేశ్‌ను అరెస్ట్ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అయితే అతడు కొంతకాలంగా మానసిక వ్యాధితో కూడా బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు.

English summary
In a gruesome incident, a nine-year-old girl has been killed allegedly by her father in a case of human sacrifice at Jamaur village in Kanpur Dehat district on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X