వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవ్ టీజింగ్ వద్దన్నందుకు తండ్రీకొడుకులను కాల్చేశారు

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళలను ఈవ్ టీజింగ్ చేయొద్దన్నందుకు ఓ తండ్రీకొడుకులను నలుగురు దుండగులు తుపాకులతో కాల్చేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్వారా గ్రామానికి చెందిన నవాబ్(50), అతని కుమారుడు(22) పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా.. నలుగురు దుండగులు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు.

 Father-son duo shot at for opposing eve-teasing in UP

ఆ దుండగులను తండ్రీకొడుకులు వారించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు నవాబ్, సందీప్‌లను తుపాకులతో కాల్చారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారు.

బాధిత తండ్రీకొడుకులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

English summary
A 50-year-old man and his son were shot at by four miscreants when they objected to eve-teasing of some women at Barwala village, police said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X