వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జై శ్రీరాం అన్నందుకు మంత్రికి ఫత్వా, 100సార్లు అంటానన్న ఖుర్షీద్

జై శ్రీరామ్ అని నినదించినందుకు నితీష్ కుమార్ మంత్రివర్గ సహచరుడు ఖుర్షీద్ అహ్మద్‌కు ఇమారత్ షరియా ఆదివారం ఫత్యా జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

పాట్నా: జై శ్రీరామ్ అని నినదించినందుకు నితీష్ కుమార్ మంత్రివర్గ సహచరుడు ఖుర్షీద్ అహ్మద్‌కు ఇమారత్ షరియా ఆదివారం ఫత్యా జారీ చేసింది.

ఖుర్షీద్ అహ్మద్ మైనారిటీ వ్యవహారుల మంత్రగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, తనకు ఇమారత్ షరియా ఫత్వా జారీ చేయడంపై ఖుర్షీద్ అహ్మద్ ఘాటుగా స్పందించారు.

జై శ్రీరామ్ నినాదం వెనుక తన ఉద్దేశం ఏమిటో అల్లాకు తెలుసునని అన్నారు. బీహార్ రాష్ట్రాభివృద్ధి జరుగుతుందంటే జై శ్రీరామ్ అని 100 సార్లు అనడానికి కూడా తాను వెనుకాడనని అన్నారు.

 Fatwa issued against Bihar Minister for chanting 'jai shri Ram'; Khurshid remains defiant

తన ఉద్దేశ్యాన్ని తప్పుగా అర్ధం చేసుకోవడం వల్లే ఫత్యా జారీ చేశారన్నారు. ఇస్లాం మతం సహనాన్ని, సోదరభావాన్ని ప్రబోధిస్తుందని, సాటివారిని ప్రేమించాలని చెబుతుందన్నారు.

ఫత్వాలకు బయపడేది లేదని, తానేమిటో తన పనితీరే చెబుతుందన్నారు. బీహార్ ప్రజల పట్ల తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు మాత్రమే తాను భయపడతానని, మిగతా వాటికి ఖాతరు చేయనన్నారు.

కాగా, ఖుర్షీద్ అహ్మద్ జై శ్రీరామ్ నినాదం చేస్తూ తాను రామ్, రహీమ్‌ను సమానంగా ఆరాధిస్తానని చెబుతున్నారని, ఇస్లాం మతం దీనిని ఎంతమాత్రం అంగీకరించదని ఫత్వా జారీ చేసిన మత పెద్ద ముఫ్తి సుహైల్ అన్నారు.

English summary
Bihar Minister ​Khurshid alias Firoz Ahmad on Sunday said that he will not hesitate in chanting 'jai shri Ram' for the sake of harmony and development of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X