చికిత్సకు వెళ్లి, లిఫ్ట్ గుంతలో పడి దుర్మరణం
బెంగళూరు: భార్యకు చికిత్స చేయించడానికి ఆసుపత్రికి వెళ్లిన వృద్దుడు ఆకస్మికంగా లిఫ్ట్ గుంతలో పడి దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరులోని నాగరబావిలోని ఫోర్టీస్ ఆసుపత్రి లో సచ్చిదానంద మూర్తి (80) ఆనే ఆయన మరణించారు.
సచ్చిదానంద మూర్తి భార్య కిడ్నాలు చెడికావడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. నాగరబావిలోని ప్రసిద్ది చెందిన ఫోర్టీస్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. గురువారం సచ్చిదానంద మూర్తి భార్యాను పిలుచుకుని ఫోర్టీస్ ఆసుపత్రికి వెళ్లారు.
భార్యను వైద్యలు దగ్గరకు పంపించారు. తరువాత ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో లిఫ్ట్ స్విచ్ ఆన్ చేశారు. ఆ సందర్బంలో లిఫ్ట్ మూడవ అంతస్తులో ఉంది. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో లిఫ్ట్ డోర్ లు తెరుచుకోవడంతో సచ్చిదానంద మూర్తి చూసుకోకుండా లోపలికి వెళ్లారు.
అక్కడ లిఫ్ట్ లేకపోవడంతో ఆయన లిఫ్ట్ గుంతలో పడి మరణించారు. సాయంత్రం అయినా ఆయన కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది. సచ్చిదానందమూర్తి కుటుంబ సభ్యులు ఫోర్టీస్ ఆసుపత్రి నిర్వహకులపై ఫిర్యాదు చెయ్యడంతో జ్ఞానభారతీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.