నేనే కాదు, వాళ్లు కూడా: మోడీ, సల్మాన్ ఖాన్లపై రాఖీ సావంత్
తానే కాదు.. మోడీ, బాబా రామ్దేవ్, సల్మాన్ ఖాన్ కూడా ఒంటరి జీవితమే గడుపుతున్నారని, ఇలా ఉండడం ఆనందంగానే ఉందని రాఖీ సావంత్ అన్నారు.
ముంబై: ఇప్పటి వరకు ఒంటరిగా జీవించడమే ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అన్నారు. బాబా రామ్దేవ్, ప్రధాని మోడీ, సల్మాన్ ఖాన్.. వీళ్లంతా సింగిల్గానే ఉన్నారని, వాళ్లను చూసి తాను కూడా ప్రస్తుతానికి అలాగే ఉండాలని అనుకుంటున్నానని ఆమె చెప్పారు.
అయితే తన సహచర భాగస్వామిని ఎంచుకునేందుకు మరోసారి రాఖీ కా స్వయంవర్ రియాల్టి షోను నిర్వహిస్తానని చెప్పారు. రాఖీ సావంత్ క్రేజీ 4,1920 వంటి చిత్రాల్లో నటించారు. 2009లో ఇదే పేరుతో నిర్వహించిన రియాలిటీ షో మొదటి సీజన్లో కెనడా వ్యాపారవేత్త ఈలేష్ పరుజన్వాలను తన భర్తగా ఎంచుకుంది.
తర్వాత అభిప్రాయభేదాలతో ఇద్దరు విడిపోయారు. డబ్బు కోసమే తాను ఈలేష్ను ఇష్టపడ్డానని ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో రాఖీ చెప్పారు. సరైన జోడీ దొరికే వరకు పెళ్లి అనేది తన కార్డులో లేదని ఆమె చెప్పారు. తనకు కాబోయే భర్త కష్టపడి పనిచేసేవాడు, సంపన్నుడు, కలివిడి గలవాడు, శక్తిమంతుడు అయి ఉండాలని ఆమె చెప్పారు.
అలాంటివాడిని వెతికి పట్టుకునేందుకే తాను స్వయంవరాన్ని మరోసారి నిర్వహించాలని అనుకుంటున్నానని చెప్పారు. కాగా, రాఖీ సావంత్ పెళ్లి చేసుకుంటే మంచిదని ఆణె స్నేహితురాలు, హాలీవుడ్నటి సోఫియాహయత్ అన్నారు.