వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్‌పై ఈసీ గరం.. FIR నమోదు చేయాలంటూ ఆదేశం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : పొలిటిషియన్ గా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు.. రాజకీయ క్షేత్రంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన గౌతమ్ గంభీర్ కు షాక్ మీద షాక్ తగులుతోంది. రెండు ఓట్లు కలిగి ఉన్నారన్న వివాదం సద్దుమణగకముందే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీకి అనుమతి తీసుకోలేదనే కారణంతో.. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై సీరియస్ అయింది.

370 ఆర్టికల్ రద్దు చేస్తాం.. భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీయలేరు : అమిత్ షా370 ఆర్టికల్ రద్దు చేస్తాం.. భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీయలేరు : అమిత్ షా

File FIR against BJP’s Gambhir for holding rally without permission says EC

ఇటీవలే కమల తీర్థం పుచ్చుకున్న గౌతమ్ గంభీర్.. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అయితే, ఏప్రిల్ 25వ తేదీన జంగ్‌పురా ప్రాంతంలో ప్రచార ర్యాలీ నిర్వహించాడు. ఈసీ రూల్స్ ప్రకారం.. ర్యాలీ నిర్వహించాలంటే ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే ర్యాలీ సాగింది. దాంతో ఆయనపై స్థానికంగా కేసు ఫైల్ చేయాల్సిందిగా తూర్పు ఢిల్లీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ను ఆదేశించింది ఈసీఐ.

ఇటీవల గౌతం గంభీర్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆప్ లీడర్ అతిషి ఆయనకు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారు. కరోల్ బాగ్ తో పాటు రాజిందర్ నగర్ లో రెండుచోట్ల ఆయనకు ఓటు హక్కు ఉందనేది ప్రధాన ఆరోపణ. నామినేషన్ సందర్భంగా తప్పుడు సమాచారం పొందుపరిచారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

English summary
The Election Commission on Saturday asked the Delhi Police to file an FIR against the cricketer-turned-politician for “holding a political rally without taking permission.” It asked the returning officer of East Delhi constituency to lodge a case against BJP’s new entrant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X