కుప్పకూలిన షేర్ మార్కెట్లు.. 462 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మధ్యాహ్నా 600 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరకు పుంజుకొని 37 వేల మార్కు వద్ద క్లోజయ్యింది. చివరి గంటలో నిప్టీకి కలిసొచ్చింది. 11 వేల మార్కు దిగువలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ముగిసింది. తర్వాత సెన్సెక్స్ 462, నిప్టీ 138 పాయింట్ల నష్టాలను చవిచూశాయి.
ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ పతనం చవిచూశాయి. 17 ఏళ్ల కనిష్ట మార్కుకు మార్కెట్లు పడిపోయాయి. ఒకనొక సమయంలో సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టపోయింది. తర్వాత కాస్త పుంజుకొని 37 వేల మార్కు వద్ద క్లోజయ్యింది. 37018.32 వద్ద ముగిసి .. 462.80 నష్టాల్లో ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 138 పాయింట్లు నష్టపోయి 10 వేల 980 వద్ద క్లోజయ్యింది. వేదాంత, జేఎస్డబ్ల్యూ, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ, టాటా మోటార్స్ నిఫ్టీలో షేర్లను నష్టపోయాయి. నిఫ్టీలో విప్రో, భారతి ఇన్ ఫ్రాటెల్, మారుతి సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభాలు గడించాయి. దీంతోపాటు స్టీల్ 3 శాతం, సీఎస్యూ బ్యాంక్ 2 శాతం, ఐటీ 1.8 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.