ఎన్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్పై ఆర్థిక నేరాల విభాగం కేసు, మరో 69 మందిపై కూడా..
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీపీ మరో దెబ్బ తగలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అధికార బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీపీ ముఖ్య నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్పై ఆర్థిక నేరాల వింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. ఆయనతోపాటు మరో 69 మందిపై ఈవోడబ్ల్యూ కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటిట్ బ్యాంక్ స్కాం (ఎంఎస్సీబీ) కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే అజిత్ పవార్పై దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేశాయి.
ఎంఎస్సీబీ కుంభకోణంలో అజిత్ పవార్ సహా మరో 69 మందిపై ఈవోడబ్ల్యూ కేసు నమోదు చేసింది. బొంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్థిక నేరాల విభాగం కేసు కట్టింది. అజిత్ పవార్పై కేసు నమోదు చేసేందుకు ముంబై పోలీసులకు హైకోర్టు ఐదురోజుల సమయం ఇచ్చింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అజిత్ సహా 69 మందిపై 420, 506, 409, 465, 465. 467 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతోపాటు పీడబ్ల్యూపీ పార్టీకి చెందిన జయంత్ పాటిల్, బ్యాంకు అధికారులపై కూడా అభియోగాలు నమోదు చేశారు. ఎంఎస్సీబీ బ్యాంకు రాష్ట్రంలోని 34 జిల్లాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.