కోవిడ్ ఆస్పత్రిలో మంటలు.. వార్డులకు వ్యాపించిన వైనం,, ఐదుగురు మృతి..
ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్పూర్లో ప్రమాదం జరిగింది. కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. రాజధాని ఆస్పత్రిలో మంటలు అంటున్నాయి. ప్రమాదంతో ఐదుగురు చనిపోయారు. మంటల్లో ఒకరు, ఊపిరి ఆడక నలుగురు చనిపోయారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదంలో చనిపోయిన వారు కూడా కరోనా సోకిన రోగులేనని తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. తర్వాత ఇతర వార్డులకు మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన తర్వాత మంటలు ఆర్పే యంత్రాలను ఎందుకు వాడలేదనే అంశంపై విచారణ జరుపుతామని తెలిపారు. ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకొని.. మంటలను ఆర్పుతున్నాయి.
ప్రమాద ఘటనపై ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భాగల్ స్పందించారు. చనిపోయిన వారి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Chhattisgarh: Fire broke out at a hospital in Raipur.
— ANI (@ANI) April 17, 2021
Tarkeshwar Patel, Additional SP says, "5 persons lost their lives in the incident. Other patients have been shifted to other hospitals. Investigation will be done." pic.twitter.com/dG4PuvapOU