మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం: 250మంది రోగుల తరలింపు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధానిలోని కోల్కతా వైద్య కళాశాల ఆస్పత్రిలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆస్పత్రిలోని 250 మంది రోగులను సెలైన్ సీసాలు, స్ట్రెక్చర్లతో సహా హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో కొందరిని ఇతర ఆస్పత్రులకు పంపించారు.
తొలుత బుధవారం ఉదయం 7.30 ప్రాంతంలో దట్టమైన పొగ రావడం గమనించిన సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఆస్పత్రిలోని ఫార్మసీ విభాగంలో తొలుత మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న పది అగ్ని మాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
#Kolkata: Firefighting operation underway at Kolkata Medical College and Hospital. Kolkata Mayor & Fire Minister says, "All the patients were moved from the area safely. There is thick smoke in the area, the situation will be soon brought under control." pic.twitter.com/7MZohqFiBk
— ANI (@ANI) October 3, 2018
పోలీసులతోపాటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#Visuals from outside Kolkata Medical College and Hospital, a fire broke out in the hospital's department of pharmacy, in the morning, today. Fire firefighting operation is underway. pic.twitter.com/NOJX5bmqyc
— ANI (@ANI) October 3, 2018
కాగా, మంగళవారం నగరంలోని నగర్బజార్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక బాలుడు చనిపోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు.