ఢిల్లీ రైల్వే స్టేషన్ భారీ అగ్ని ప్రమాదం: ఎక్స్ప్రెస్ రైలులో మంటలు, ప్రయాణికుల పరుగు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని రైల్వే స్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ ఫాం 8లో ఆగిన ఛండీగఢ్-కొచువెల్లి ఎక్స్ప్రెస్ బోగీల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక రైలు, ఫ్లాట్ ఫాంలపై ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు.
భారత సంతతి బాలిక వెంటపడి పాక్ యువకుడి అసభ్య ప్రవర్తన
అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ నుంచి ప్రయాణికులను దూరంగా తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
12218 ఛండీగఢ్-కొచ్చువెల్లి ఎక్స్ప్రెస్లో రేర్ పవర్ కార్లో 1.40గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని నార్తర్న్ రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు. ఫ్లాట్ ఫాం నెంబర్ 8 నుంచి రైలు కదులుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.
A fire has broken out in rear power car of Chandigarh-Kochuveli Express at platform number. 8 of New Delhi Railway Station. Four fire tenders are present at the spot. All passengers have been evacuated safely. https://t.co/KWkKjrIHkU pic.twitter.com/AvqrfyQyda
— ANI (@ANI) September 6, 2019
ఢిల్లీ రైల్వే స్టేషన్లో నిలిచివున్న 12218 ఛండీగఢ్-కొచ్చువెల్లి ఎక్స్ప్రెస్లో రేర్ పవర్ కార్లో మంటలు చెలరేగాయని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ మేరకు ట్విట్టర్ విషయాన్ని తెలిపారు.
दिल्ली में चंडीगढ - कोचुवल्ली एक्सप्रेस की पिछली पॉवर कार में आग लगने की घटना हुई है।
— Piyush Goyal (@PiyushGoyal) September 6, 2019
फॉयर ब्रिगेड द्वारा मौके पर पहुंच आग पर काबू पा लिया गया है। वरिष्ठ अधिकारी घटनास्थल पर हैं तथा स्थिति पर नजर रखे हुए हैं। घटना में किसी प्रकार की कोई जनहानि नही हुई है।