ఐఎన్ఎస్ లో అగ్ని ప్రమాదం , నౌకదళ అధికారి మృతి
భారత దేశం యొక్క ఏకైక యుద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య లో అగ్ని ప్రమాదం సంభవించింది. కాగా ఈ ప్రమాదంలో ఓ నౌకఅధికారి మరణించారు. ప్రస్థుతానకి మంటలు అదుపులో ఉన్నాయని తెలిపారు నేవీ అధికారులు.
ఐఎన్ఎస్ లో ప్రమాదం ,
కర్ణాకట లోని కార్వార్ నౌకాశ్రయంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రవేశిస్తున్న సమయంలో నౌకలో మంటలు చెలరేగాయి. అయితే నౌకలో ఉన్న కమాండర్ డిఎస్ చౌహన్ ఆధ్వర్యంలో సిబ్చంది, చాల ధైర్యంగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారని, కాని పోగ ఊపిరాడనీయకపోవడంతో సదరు అధికారిిని కార్వర్ ఆసుపత్రికి తరలించారని అయినా ప్రయోజన లేదని చెప్పారు.
అదుపులో మంటలు
అయితే ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశామని నేవి అధికారులు తెలిపారు. ప్రస్థుతం మంటలు అదుపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. సంఘటన విచారణ చెపట్టినట్టు నేవి అధికారులు తెలిపారు.
రష్యానుండి చేరిన విమాన వాహక నౌక
కాగా ఐఎన్ఎస్ విక్రమాదిత్య జనవరి 2014 లో రష్యా నుండి ఇండియా చేరింది.కాగా దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు, కాగా దాన్ని కర్ణాటక సమీపంలోని కార్వాన్ నౌకశ్రయంలో ఉంచుతారు,
60 మీ పోడవు, 284 మీటర్ల వెడల్పు
ఐఎన్ఎస్ విక్రమాధిత్య 284 మీటర్ల పోడవుతో 60 మీటర్ల ఎత్తును కల్గి ఉంటుంది. 40 టన్నుల బరువును కల్గిఉన్న షిప్ ఇది.అంతస్తుల బిల్డింగ్ ను పోలి ఉంటుంది.