వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ముష్కరులు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ...

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుచేసి .. విభజించాక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న తరుణంలో ముష్కరులు రెచ్చిపోయారు. ఈ నెల 5న కశ్మీర్ విభజన జరగగా .. 22 రోజులకు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇద్దరు పౌరులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. పౌరులను హతమార్చింది ఉగ్రవాద సంస్థకు చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని మట్టుబెట్టింది ఎవరనే అంశం దర్యాప్తులో తేలే అవకాశం ఉంది.

కశ్మీర్ విభజన తర్వాత ఉగ్ర మూకలు రెచ్చిపోయారు. పూంచ్ జిల్లా ట్రాల్‌కు చెందిన మంజూర్ అహ్మద్, మహద్ ఖదీర్ అనే ఇద్దరిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. వాస్తవానికి వారిద్దరూ ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు యువకుల కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. ఇంతలో గురువారం వారిద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి హత్యకు సంబంధించి వివరాలను కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు

First incident of terror after Kashmir lockdown, militants kill 2 in Tral

కశ్మీర్ విభజన జరిగిన తర్వాత తొలిసారి ఉగ్ర మూకలు రెచ్చిపోయారు. ఇద్దరు పౌరులపై దాడిచేసి హతమార్చారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారీగా బలగాలను మొహరించిన సంగతి తెలిసిందే. 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది కశ్మీర్ లోయలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంత పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా ఉగ్రవాదుల దాడులు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ నెల 20న బారాముల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కాల్పుల్లో లష్కరే తోయిడా ఉగ్రవాది చనిపోగా, ఓ స్పెషల్ పోలీసు అధికారి వీరమరణం పొందారు. ఓ పోలీసు ఎస్సై గాయాలతో చికిత్స పొందుతున్నారు.

English summary
two civilians have been killed by suspected militants in the Satoora in Tral of South Kashmir's Pulwama District. The victims have been identified as Manzoor Ahmad Kohli and Mohad Qadir. They were cousins. Both victims were residents of Poonch and were nomads in the Tral area. The duo was kidnapped by militants on August 20 and since then the police had been looking for them. On Thursday the police recovered their bodies from the forest area of Tral. Police have started investigations and a hunt is on for those responsible for the killings, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X