రెండు నెలల్లో ఇండియాకు చేరనున్న రఫెల్ జెట్ ఫైటర్స్ : ఫ్రెంచ్ అంబాసిడర్
వివాదాలకు కేంద్రబిందువైన రఫెల్ యుద్ద విమానాలు మరో రెండు నెలల్లో భారత్కు చేరనున్నట్టు ఇండియలో ఫ్రెంచ్ అంబాసిడర్ అలగ్జెండర్ ప్రకటించాడు. అనంతరం భారత ఒప్పందం చేసుకున్న మొత్తం 36 రఫెల్ జెట్స్ రానున్న రెండు సంవత్సరాల్లో భారత్కు అందనున్నాయని ఆయన ప్రకటించారు.
మధ్యప్రదేశ్లోని ఓ ఫ్రంచ్ పెట్టుబడులతో ప్రారంభమైన కంపనీ ప్రారంభోత్సవానికి హజరయ్యారు. ఈనేపథ్యంలోనే అనుకున్న ఖచ్చితమైన సమయానికే రఫేల్ విమానాలు భారత్ చేరుకుంటాయని అన్నారు. తాను వివాదాల జోలికి పోదల్చుకోలేదని మాకు కావల్సింది ఫలితాలని అన్నారు. రఫెల్ ఒప్పందంతో భారత్ ,ఫ్రెంచ్ దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపడ్డాయని అన్నారు. ఈనేపథ్యంలోనే గత మూడు సంవత్సరాల క్రితం 3000 వేల మంది విద్యార్థులు తమ దేశానికి వస్తే ఇప్పుడది 10వేలకు చేరిందని అన్నారు. ఈనేపథ్యంలోనే భారత్ ,ఫ్రెంచ్ దౌత్య సంబంధాలు కొనసాగుతాయని అన్నారు.
రఫెల్ జెట్ ఫైటర్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని గత పార్లమెంట్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..ఈనేపథ్యంలోనే ఒప్పందాలపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్ను సైతం స్థంబింప చేశాయి. ఒప్పందాలను ముందుగానే రిలయన్స్ కంపనీకి తెలిపారనే ఆరోపణలు మోడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. దీంతో మోడీ సైతం రాజీవ్ గాంధీపై బోఫోర్స్ కుంభకోణంలో అవినీతి మరకలు అంటించాడు. దీంతో ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య తీవ్ర దుమారం రేగింది.