AOB encounter: విశాఖలో భారీ ఎన్కౌంటర్, ఐదుగురు మావోయిస్టుల మృతి?
విశాఖపట్నం: ఏవోబీలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. విశాఖలోని ధారకొండ ఏజెన్సీలోని మాదిగమల్లులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మధ్యాహ్నం వార్తలు అందే సమయానికి ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరిన్ని పోలీసులు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డాయి. ఏవోబీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో ఇటీవలే ఈస్ట్ జోన్ నుంచి వచ్చిన అరుణ మృతి చెందినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఈ నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో గుమ్మిరేులలో మావోయిస్టుల సంచారం ఉందని కూంబింగ్ దళాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి.
గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏడాదికి ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది.