శబరిమలలో బంగారు ద్వజస్థంభం మీద రసాయనాలు పోశారు. ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు !
ప్రసిద్ది చెందినద శబరిమల అయ్యప్పస్వామి ఆలయం ముందు బంగారుతో తయారు చేసిన ద్వజస్థంభం మీద రసాయనాలు పోసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు వ్యక్తులను కేరళ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
శబరిమల: ప్రసిద్ది చెందినద శబరిమల అయ్యప్పస్వామి ఆలయం ముందు బంగారుతో తయారు చేసిన ద్వజస్థంభం మీద రసాయనాలు పోసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు వ్యక్తులను కేరళ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
అయ్యప్పస్వామి ఆలయం ఆవరణంలో ఆదివారం గరుడగంబ, పంచలోహాలతో తయారు చేసిన ద్వజస్థంభం ప్రతిష్టించారు. ద్వజస్థంభం ప్రతిష్టించిన కొన్ని గంటల్లోనే కొందరు నిందితులు ద్వజస్థంభం మీద రసాయనాలు పోసి పరారైనారు.
రసాయనాలు పోయడంతో ద్వజస్థంభం దెబ్బతినిందని గుర్తించిన ఆలయం అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యప్పస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదు మంది వలస కార్మికులు ఆలయంలో కొత్తగా ప్రతిష్టించిన ద్వజస్ఘంభం మీద రసాయనాలు పోశారని పోలీసులు గుర్తించారు. ద్వజస్థంభం ప్రతిష్టించిన కొన్ని గంటల్లోనే నిందితులు రసాయనాలు పోయడంతో ద్వజస్ఘంభం దెబ్బతినిందని అయ్యప్పస్వామి ఆలయం పరిపాలనా విభాగం అధికారులు అంటున్నారు.