వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మృతి: వరదల్లో 7గురు, రోడ్డు ప్రమాదం మరో 7గురు

|
Google Oneindia TeluguNews

గౌహతి/జైపూర్: అస్సాంలో కురిసిన 15 గంటల ఏడతెరిపిన లేని వర్షానికి రాజధాని గౌహతి తోపాటు నాలుగు జిల్లాల్లో రవాణా, విద్యుత్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు.
కొండచరియలు విరిగిపడి ముగ్గురు, విద్యుదాఘాతంతో మరో నలుగురు మృత్యువాతపడ్డారు.

గౌహతి నగరంలో అనేక ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. అస్సా ముఖ్యమంత్రి తరుణ్ గోగొయ్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముంపు బాధితులకు పునరావా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నదిలో ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంటోంది.

Flash Floods in Guwahati, Seven Dead in Last 15 Hours

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. జైసల్మేర్ జిల్లాలోని కీటా ఫాంటా ప్రాంతంలో కార్మికులతో ప్రయాణిస్తున్న ఓ జీపును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరికొంతమందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు డిఎస్పి అశోక్ మీనా తెలిపారు.

English summary
Flash floods ravaged Guwahati and four districts in Assam, killing seven persons, including three in landslides in the Koinadhana area close to chief minister Tarun Gogoi's residence in the state capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X