దుబాయ్ టూ మంగళూరు: రన్ వేలో ముందుకు దూసుకెళ్లిన విమానం, 183 మంది ప్రయాణికులు!
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు బజ్పే అంతర్జాతీయ విమానాశ్రంలో విమానం అదుపుతప్పడంతో తృటిలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది ప్రయాణికులను క్షేమంగా కిందకు దించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
దుబాయ్ నుంచి మంగళూరులోని బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయంకు ఎయిర్ ఇండియా 380 విమానం వచ్చింది. మంగళూరులోని బజ్పే అంతరాజ్జాతీయ విమానశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. తరువాత విమానాన్ని పార్కింగ్ స్థలంలో ఉంచే సమయంలో ఒక్కసారిగా అది ముందుకు దూసుకెళ్లింది.
విషయం గుర్తించిన పైలెట్ అప్రమత్తం అయ్యి విమానాన్ని అదుపుచేశారు. విషయం గుర్తించిన ఎయిర్ పోర్టు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులు, విమానం సిబ్బందిని క్షేమంగా బయటకుదించారు. విమానం ముందుకు దూసుకెళ్లిన సమయంలో విమానంలో 183 మంది ప్రయాణికులు. విమాన సిబ్బంది ఉన్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి యూటీ. ఖాదర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి బజ్పే విమానాశ్రయం అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గతంలో మంగళూరులోని బజ్పే విమానాశ్రయంలో విమాన ప్రమాదలు జరిగాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.