రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి అంత్యక్రియలు
ముంబై: దుబాయ్లో మృతి చెందిన ప్రముఖ నటి శ్రీదేవి భౌతికకాయంతో దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం భారత్ బయలు దేరింది. ఈ రోజు రాత్రి పది గంటలకల్లా అది ముంబై చేరుకోనున్నట్టు సమాచారం.
శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ముంబైలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్లో రేపు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి పవన్ హన్స్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లే హిందూ శ్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో ముంబైలోని శ్రీదేవి నివాసం వద్దకు ఆమె అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. శ్రీదేవి కుమార్తెలు జాహ్నవి, ఖుషి కపూర్తో పాటు ఇతర కుటుంబసభ్యులు ప్రస్తుతం నటుడు అనిల్ కపూర్ నివాసం వద్ద వేచి ఉన్నట్టు సమాచారం.