8 నుంచి బ్రిటన్ టు ఇండియా ప్లైట్స్ పునరుద్దరణ.. వారానికి 15 ప్లైట్లకు అనుమతి..
కొత్త రకం కరోనా స్ట్రెయిన్ హై టెన్షన్ నెలకొంది. ఈ వైరస్ జాడ బ్రిటన్లో కనిపించడంతో అక్కడినుంచి రవాణాను దాదాపుగా అన్నీ దేశాలు నిషేధం విధించాయి. ఇవాళ (శుక్రవారం) వరకు భారత దేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు 29కి చేరాయి. మిగతా దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్షికంగా కొన్ని విమానాలు నడిపించేందుకు అనుమతి ఇచ్చింది.
Recommended Video
ఈ నెల 8వ తేదీ నుంచి బ్రిటన్ నుంచి భారత్కు కొన్ని విమాన సేవలను పునరుద్దరిస్తామని పౌర విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు వారానికి 15 విమానాలు రవాణాకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూర్, హైదరాబాద్ నుంచి బ్రిటన్కు విమాన సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. తర్వాత పరిస్థితిని బట్టి పెంచడం/ తగ్గించడం ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. విమాన సేవల పునరుద్దరణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉత్తర్వులు జారీచేస్తోందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.