సామాన్యులు కూడ విమానంలో చక్కర్లు కొట్టొచ్చు
డిల్లీ: ఇక నుండి విమానంలో ప్రయాణం చేయడం కూడ అతి చౌకే. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ పథకం ప్రారంభం కానుంది. దేశంలోని చిన్న నగరాలకు ప్రయాణీకులను చేరవేసే విధంగా కేంద్రప్రభుత్వం ఉఢాన్ అనే పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం కింద తొలి విమానం వచ్చే ఏడాది జనవరిలో ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. ...గంటకు 5 వేల రూపాయాలను వసూలు చేయనున్నారు.హెలిక్యాప్టర్ కు అరగంటకు 2500 రూపాయాలను వసూలు చేయనున్నారు.
విమాన ప్రయాణం వ్యయంతో కూడుకొన్నదని భావించే వారికి....మోడీ ప్రభుత్వం తీపి కబురును అందించింది. విమానంలో ప్రయాణం ఇక చౌకగా మారనుంది..సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ఉడాన్ (ఉడే డేస్ కా ఆమ్ నాగరిక్) అనే పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.ఈ పథకం కింద విమాన టిక్కెట్ట ధరను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూంటారు.ప్రధాన రూట్లలో ప్రతి డిపార్చర్ కు చిన్న మొత్తంలో లెవీ విధించాలన్న విషయంై నెలాఖరులోపుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రయాణీకుల లెవీ విధిస్తే ఒక్కో టిక్కెట్టు పై అదనంగా 60 రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది.

వచ్చే ఏడాది జనవరి నుండి ఉడాన్ స్కీమ్ కింద కనీసం 30 ఎయిర్ పోర్ట్ లను రీజినల్ ఫ్లెయిట్ ను రీసివ్ చేసుకొనేలా తీర్చదిద్దాలని కేంద్రం సంకల్పించింది.సామాన్యులు విమనం టిక్కెట్టును కొనుగోలు భరించేలా టిక్కెట్టు ధరలను నిర్ణయించనుంది కేంద్రం. అదే సమయంలో విమానాలను నడిపే రీజినల్ ఆపరేట్లకు కూడ లాభం కలిగేలా చర్యలను తీసుకోనుంది.ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది ప్రభుత్వం.సక్సెస్ పుల్ ఆపరేటర్లకు మూడేళ్ళపాటు రీజినల్ ప్లయిట్లను నడిపేలా అనుమతి ఇవ్వనుంది ప్రభుత్వం.
విమానానికి గంటలోపు ప్రయాణానికి 2,500 రూపాయాలను వసూలు చేసే అవకాశం ఉంది. హెలిక్యాప్టర్ కు మాత్రం అరగంటకే రూ.2500 వసూలు చేయనున్నారు.గంటకు 5 వేలను హెలిక్యాప్టర్ లో ప్రయాణం చేస్తే వసూలు చేయనున్నారు.వారంలో కనిష్టంగా మూడు...గరిష్టంగా 7 విమానాలు తిరిగేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ పథకం కింద సామాన్యులు కూడ విమానంలో చక్కర్లు కొట్టే అవకాశం దక్కనుంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications