వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాణా స్కాం: లాలూను దోషిగా తేల్చిన కోర్టు, జైలుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lalu Prasad Yadav
రాంచీ: దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీ సిబిఐ కోర్టు సోమవారం దోషిగా నిర్ధారించింది. కోర్టు తీర్పు కోసం లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన అనుచరులతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. లాలూను దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్షను రేపు ఖరారు చేయనుంది.

లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువుల దాణాకు సంబంధించి రూ.35 కోట్ల రూపాయలు కాజేశారనే అభియోగంపై సిబిఐ విచారణ చేపట్టింది. పదహారేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతోంది. ఇప్పుడు న్యాయస్థానం లాలూతో పాటు నలభై ఐదు మందిని దోషులుగా నిర్ధారించింది. కోర్టు దోషిగా తేల్చినందున లాలూకు మూడు నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.

ఈ కుంభకోణం బయటకు రావడంతో లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఇప్పుడు దోషిగా నిర్ధారణ కావడంతో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. ఈ కేసులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఒకరు కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా. రెండో వారు లాలూ ప్రసాద్ యాదవ్. అయితే, ఇది ప్రత్యర్థి పార్టీల కుట్రగా ఆర్జేడి ఆరోపిస్తోంది.

కాగా లాలూను, జగన్నాథ మిశ్రాను కస్టడీలోకి తీసుకొని వారిని రాంచీ జైలుకు తరలించారు. మొత్తం రూ.950 కోట్ల కుంభకోణంలో లాలూ సిఎంగా ఉన్న సమయంలో రూ.35 కోట్లకు పైగా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి.

English summary
RJD chief Lalu Prasad Yadav found guilty in Fodder scam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X