వయస్సు, ఆరోగ్యం చూసి తక్కువ శిక్ష వేయండి: లాలూ ప్రసాద్, మళ్లీ శిక్ష ఖరారు వాయిదా
లక్నో: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సహా మిగతా దోషులకు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. లాలూ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనకు తక్కువ శిక్ష విధించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది చిత్తరంజన్ సిన్హా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆయన జార్ఖండ్ రాంచీలోని సీబీఐ కోర్టు నుంచి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణం కేసులో దోషులకు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి శిక్ష ఖరారు చేస్తారని చెప్పారు.
కాగా, రెండు రోజు క్రితం న్యాయవాది విందేశ్వర ప్రసాద్ మృతితో తీర్పు వాయిదా పడుతూ వస్తోంది.
అంతకుముందు, తన వయస్సు, ఆరోగ్యం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తనకు తక్కువ శిక్ష వేయాలని లాలూ కోరిన పిటిషన్ దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో తనకు ఎటువంటి ప్రత్యక్ష పాత్ర లేదని, తన వయస్సు, ఆరోగ్యందృష్ట్యా శిక్షను తగ్గించాలని కోరారు.