ముంబైలో శివసేన-బీజేపీ హవా: ముందే రిజైన్ చేసిన కాంగ్రెస్ చీఫ్
ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ముంబై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్ రాజీనామా చేశారు.
ముంబై: ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ముంబై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్ రాజీనామా చేశారు.
బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్టీ నాయకత్వానికి రాజీనామా పంపినట్లు చెప్పారు.
బీఎంసీ ఎన్నికల ఫలితాలు: శివసేన, బీజేపీ హోరా హోరీ, ఎవరికి దక్కని మేజిక్ ఫిగర్
ఈ రోజు (గురువారం) ఫలితాలు వచ్చాయి. అయితే, ఎగ్జిట్ ఫోల్ మాత్రం బీజేపీ, శివసేన హవా ఉంటుందని తేల్చి చెప్పాయి. దీంతో తాను బుధవారం నాడే రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించానని చెప్పారు.
అంతేకాదు, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని కూడా తాను అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారి పైన చర్యలు తీసుకోకుంటే పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని హెచ్చరించారు. అయితే, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేశఆరో ఆయన చెప్పలేదు.
గత కార్పోరేషన్ ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో తక్కువ సీట్లు గెలుచుకుంది.
ఈసారి జరిగిన ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో శివసేన, బీజేపీ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. బీజేపీ 84 సీట్లు, శివసేన 84 సీట్లు, కాంగ్రెస్ 32 సీట్లు, ఎంఎన్ఎస్ 8 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.