ఆచూకి లభించని An-32 విమానం... అర్థరాత్రి వరకు కొనసాగిన ప్రయత్నాలు
ఆస్సాంలో టేకాఫ్ అయినా కాసేపటికే తప్పిపోయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం an-32 మిలిటరీ ట్రాన్స్ పోర్టో విమానం అడ్రస్ ఇంతవరకు లభించలేదు. కాగా ఇందుకోసం అర్థరాత్రి వరకు కూడ వెతికనట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. కాగా విమానం ఆచూకి కోసం ఇండియన్ ఆర్మీతో స్థానిక అధికారుల సహయం కూడ తీసుకుంటున్నామని ఇందుకోసం సుఖోయ్ 30 జెట్ ఫైటర్ తోపాటు సీ -130 యుద్ద విమానాలను కూడ రంగంలోకి దింపినట్టు ఐఏఎఫ్ అధికారులు తెలిపారు.
ఆస్సాంలో టేకాఫ్ అయినా కాసేపటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన an-32 మిలిటరీ ట్రాన్స్ పోర్టో విమానం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మిస్ అయింది..కాగా మధ్యహ్నం 12.35 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం మధ్యహ్నాం ఒంటిగంట నుండి విమానానికి సంబంధించిన సమాచారం తెలియడంలేదు. కాగా అస్సాం ఎయిర్ బేస్ నుండి నుండి మధ్యహ్నం 12.35 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మిస్ అయినట్టు అధికారులు తెలిపారు. కాగా విమానంలో 13 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 5గురు ప్రయాణికులు కాగా మరో ఎనిమిది మంది ఐఏఎఫ్ సిబ్బంది ఉన్నారు.
కాగా విమానాన్ని కనుగోనేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని ప్రయత్నాలను చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అటోనోవ్ 32 అస్సాంలోని జోర్హాట్ నుండి అరుణాచల్ ప్రదేశ్లోని మెచుక వ్యాలీకి వెళుతోంది. కాగా మెచుక వ్యాలీలో ఉన్న ఎయిర్ బేస్ అంత్యంత సంక్షిష్టమైన ఎయిర్ పోర్టు, ఇక్కడ విమానాలు టేకాఫ్ ,కావడం కాని ల్యాండింగ్ కావడం కూడ అంత్యంత కష్టంతో కూడుకున్న వ్వవహరం..
ఇక 2016లో కూడ ఏన్ 32 చెన్నై నుండి అండమాన్ నికోబాద్ దీవులకు వెళుతున్న సంధర్భంలో టేకాఫ్ అయిన విమానం బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో తప్పిపోయింది.కాగా ఎయిర్ దాన్ని కనుకొనేందుకు శతవిధాలా ప్రయత్నించింది.చాల రోజుల పాటు సముంద్ర జలాల్లో వెతికింది. కాని ఇప్పటివరకు ఆ ఎయిర్ క్రాఫ్ట్ లభించలేదు. కాగా అందులో ఉన్న 29 మంది దుర్మరణం పాలయ్యారు.