మాజీ సీజేఐ, ఎంపీ రంజన్ గొగొయ్కు జడ్ ప్లస్ వీఐపీ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగొయ్కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ వీఐపీ భద్రతను కల్పించింది. ఈ క్రయంలో ఆయనకు సీఆర్పీఎఫ్ సాయుద కమాండోలు భద్రతగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.
దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా రంజన్ గొగయ్కు ఈ భద్రత ఉండనుంది. గతంలో ఢిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. కాగా, 2019 నవంబర్ నెలలో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.
ఆ తర్వాత రంజన్ గొగొయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఆర్పీఎఫ్కు చెందిన వీఐపీ భద్రతా విభాగం నుంచి ఆయనకు కమాండోలతో భద్రత కలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 8 నుంచి 12 మంది సీఆర్పీఎఫ్ కమాండోలతో కూడిన మొబైల్ టీం ఆయనకు నిరంతరం భద్రతగా ఉండనుంది. కాగా, ఈ భద్రత పొందుతున్న 63వ వ్యక్తిగా గొగొయ్ ఉన్నారని తెలిపాయి.