బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిన్న ముఖ్యమంత్రి..నేడు మాజీ ముఖ్యమంత్రి: సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్: కర్ణాటకలో కట్టుతప్పి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ కట్టుతప్పింది. కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ఆయన కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులకు సోకిన కరోనా వైరస్.. మరింత విజృంభిస్తోంది. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సోకింది. కరోనా వైరస్ లక్షణాలతో సిద్ధరామయ్య ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కరోనా లక్షణాలు కనిపించాయని, డాక్టర్ల సూచన మేరకు తాను ఆసుపత్రిలో చేరానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇదే విషయాన్ని సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్యే డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారు వెంటనే కరోనా వైద్య పరీక్షలను చేయించుకోవాలని సిద్ధరామయ్య సూచించారు. డాక్టర్లను సంప్రదించాలని, వీలైతే క్వారంటైన్లకు వెళ్లాలని పేర్కొన్నారు.

Former CM of Karnataka Siddaramaiah tests positive for covid 19

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు విఫలమౌతున్నాయని ఆయన కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుప్రతులు, పరికరాలను కొనుగోలు చేయడంలో రెండు వేల కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడిందంటూ సిద్ధరామయ్య ఆరోపించారు. దీనిపై యడియూరప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు.

Recommended Video

టార్గెట్ కర్ణాటక, కేరళ.. United Nations హెచ్చరిక || Oneindia Telugu

ఈ సమయంలో ఆయనకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే తాను ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలను సిద్ధరామయ్యను కలుసుకున్నారు. వారిలో భయాందోళనలు వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు. వారంతా కరోనా వైరస్ పరీక్షలను చేయించుకోవాలని సిద్ధరామయ్య సూచించారు.

English summary
DH Web Desk DH Web Desk, Aug 04 2020, 08:11 istupdated: Aug 04 2020, 08:14 ist Former chief minister Siddaramaiah Former chief minister Siddaramaiah Former chief minister Siddaramaiah has tested positive for Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X