నిన్న ముఖ్యమంత్రి..నేడు మాజీ ముఖ్యమంత్రి: సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్: కర్ణాటకలో కట్టుతప్పి
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ కట్టుతప్పింది. కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ఆయన కేబినెట్లోని ఇద్దరు మంత్రులకు సోకిన కరోనా వైరస్.. మరింత విజృంభిస్తోంది. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సోకింది. కరోనా వైరస్ లక్షణాలతో సిద్ధరామయ్య ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ನನ್ನ ಕೊರೊನ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಪಾಸಿಟಿವ್ ಎಂದು ವರದಿ ಬಂದಿದೆ. ರೋಗ ಲಕ್ಷಣಗಳಿಲ್ಲದಿದ್ದರೂ ವೈದ್ಯರ ಸಲಹೆಯಂತೆ ನಿನ್ನೆ ರಾತ್ರಿಯೇ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿದ್ದೇನೆ.
— Siddaramaiah (@siddaramaiah) August 4, 2020
ಆತಂಕಕ್ಕೆ ಕಾರಣ ಇಲ್ಲ. ಕಳೆದ ಕೆಲವು ದಿನಗಳಿಂದ ನನ್ನ ಜೊತೆ ಸಂಪರ್ಕದಲ್ಲಿದ್ದವರು ಕೊರೊನಾ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ವಿನಂತಿಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆ.
కరోనా లక్షణాలు కనిపించాయని, డాక్టర్ల సూచన మేరకు తాను ఆసుపత్రిలో చేరానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇదే విషయాన్ని సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్యే డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారు వెంటనే కరోనా వైద్య పరీక్షలను చేయించుకోవాలని సిద్ధరామయ్య సూచించారు. డాక్టర్లను సంప్రదించాలని, వీలైతే క్వారంటైన్లకు వెళ్లాలని పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు విఫలమౌతున్నాయని ఆయన కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుప్రతులు, పరికరాలను కొనుగోలు చేయడంలో రెండు వేల కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడిందంటూ సిద్ధరామయ్య ఆరోపించారు. దీనిపై యడియూరప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు.
I have been tested positive for #Covid19 & also been admitted to the hospital on the advice of doctors as a precaution.
— Siddaramaiah (@siddaramaiah) August 4, 2020
I request all those who had come in contact with me to check out for symptoms & to quarantine themselves.
Recommended Video
ఈ సమయంలో ఆయనకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే తాను ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలను సిద్ధరామయ్యను కలుసుకున్నారు. వారిలో భయాందోళనలు వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు. వారంతా కరోనా వైరస్ పరీక్షలను చేయించుకోవాలని సిద్ధరామయ్య సూచించారు.
ನಿನ್ನೆ ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ತಂದೆಯವರಿಗೆ ಜ್ವರ ಬಂದಿದ್ದು ರಾತ್ರಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿದ್ದರು. Corona antigen test ಮಾಡಲಾಗಿ ಅವರಿಗೆ ಕೊರೋನ ಸೋಂಕು ತಗುಲಿರುವುದು ಧೃಢಪಟ್ಟಿದೆ. ಇತ್ತೀಚೆಗೆ ಅವರ ಸಂಪರ್ಕಕ್ಕೆ ಬಂದವರು quarantine ಆಗಬೇಕೆಂದು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ.
— Dr Yathindra Siddaramaiah (@Dr_Yathindra_S) August 4, 2020