చేత కాకపోతే చేతులకు గాజులు వేసుకోండి, బీజేపీ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు, మీజీ సీఎం ఫైర్!
బెంగళూరు: నీవు ఒక మహిళ, మహిళలు ఎలా మాట్లాడాలో మొదట నేర్చుకో అంటూ బీజేపీ మహిళా ఎంపీ మీద కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. చేతకాని వాళ్లు చేతులుకు గాజులు వేసుకుని మూల కోర్చోవాలని బీజేపీ మహిళా ఎంపీ శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలపై సిద్దరామయ్య విరుచుకుపడ్డారు.
మీ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాడం మీ కర్తవ్యం, మీ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోవడం మీకు సాధ్యం కాకపోతే చేతికి గాజులు వేసుకుని కుర్చోవాలని హుబ్బళిలో బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే కాంగ్రెస్ నాయకుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. శోభా కరంద్లాజే వ్యాఖ్యలపై సిద్దరామయ్య అసహనంతో ట్వీట్ చేశారు.
కుమారి శోభా కరంద్లాజే గారు మీరు ఒక మహిళ అంటూ గుర్తు పెట్టుకోవాలని సిద్దరామయ్య అన్నారు. మీరు ఎంపీ హోదాలో ఉంటూ ఇలాంటి చులకనైన మాటలు మాట్లాడటం సరికాదు, ఎంపీగా మీరు మొదట ప్రజలకు సేవ చెయ్యాలని సిద్దరామయ్య సూచించారు.
చేత కాని వాళ్లు చేతులకు గాజులు వేసుకుని కుర్చోవాలని చెప్పడానికి మీరు ఎవరు, మా పార్టీ పనులు మేము చూసుకుంటాం, ఈలాంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం మంచిది కాదంటూ సిద్దరామయ్య బీజేపీ మహిళా ఎంపీ శోభా కరంద్లాజ్ కు క్లాస్ పీకారు. రాణి చెన్నమ్మ, ఓబవ్వ, ఇందిరా గాంధీ లాంటి మహిళలు సమాజంలో మంచి పనులు చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని చరిత్రలో నిలిచిపోయారని సిద్దరామయ్య ఇదే సమయంలో గుర్తు చేశారు.