మాజీ సీఎం సిద్దరామయ్య కేసు బెంగళూరుకు బదిలి: అక్రమ భూ కబ్జా, అధికార దుర్వినియోగం !
మైసూనరు/బెంగళూరు: అక్రమ భూకబ్జా, ప్రభుత్వ అధికారం దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం సిద్దరామయ్య కేసును మైసూరు నుంచి బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలి అయ్యింది. సిద్దరామయ్య మీద మైసూరులో నమోదు అయిన కేసు విచారణ బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదలి అయ్యింది.
మైసూరులో ఉన్న కేసు విచారణను బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు బదలి చేస్తున్నామని సీనియర్ న్యాయవాది సీజేఎం (మైసూరు) యశంత్ కుమార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఇక సిద్దరామయ్య మీద నమోదు అయిన కేసు బెంగళూరులో విచారణ జరగనుంది.
అక్రమ భూస్వాధీనం కేసు సిద్దరామయ్య మీద నమోదు అయ్యింది.గతంలో హినకల్ పంచాయితీ పరిధిలోని సాకమ్మకు చెందిన సర్వే నెంబర్ నెంబర్ 70/49 భూమిని భూస్వాధీనం చెయ్యలేదు. అయితే భూస్వాధీనం కాని సాకామ్మ భూమిని సిద్దరామయ్య కొనుగోలు చేశారు.
తరువాత ముడానుంచి అనుమతి తీసుకుని సర్వే నెంబర్ 70/48 ప్రభుత్వ భూమిలో మాజీ సీఎం సిద్దరామయ్య ఇంటిని నిర్మించారు. 2003లో సిద్దరామయ్య ఈ ఇంటిని వేరేవారికి విక్రయించారు. ఈ విషయంపై ఆర్ టీఐ కార్యకర్త గంగరాజు మైసూరులోని లక్ష్మిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.