డ్రింక్ లో మత్తు మందు కలిపి, డ్రగ్స్ తీసుకొని అత్యాచారమిలా, బిజెపి మాజీ ఎంఏల్ఏపై కేసు
బిజెపి మాజీ ఎంఏల్ఏ విజయ్ జాలీ ఓ మహిళపై అత్యాచారం చేసినట్టుగా బాధితురాలు ఆరోపిస్తోంది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఆ మహిళపై కూడ విజయ్ జాలీ కూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గురుగ్రామ్:డిల్లీకి చెందిన బిజెపి మాజీ ఎంఏల్ఏ ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో అరెస్టు అయ్యాడు. రిసార్ట్ లో మహిళకు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.
విజయ్ జాలీ అనే బిజెపి నేత గతంలో సాకేత్ ప్రాంతానికి ఎంఏల్ఏగా పనిచేశాడు. అయితే ఆయనను కలిసేందుకు వచ్చిన తనకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇవ్వడమే కాకుండా డ్రగ్స్ తీసుకొని తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనపై ఉద్దేశ్యపూర్వకంగానే మహిళ కేసు పెట్టిందని విజయ్ జాలీ చెబుతున్నారు.
తొలుత మహిళ తనను బెదిరించిందని దానికి తాను ఒప్పుకోకపోవడంతో తనపై లైంగిక దాడికి చేశాడని కేసు పెట్టిందని విజయ్ జాలీ చెప్పారు. అంతేకాదు బాధితురాలిపై విజయ్ జాలీ కూడ కేసు పెట్టారు.