ప్రేమించుకొన్నారు, ప్రియురాలికి మరో వ్యక్తితో నిశ్చితార్థం, దారుణమిలా...
మాజీ ప్రియురాలికి కాబోయే భర్తను చంపినందుకుగాను సైన్యంలో పనిచేస్తోన్న ఓ జవాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్ లో చోటుచేసుకొంది.
రూప్ నగర్:మాజీ ప్రియురాలికి కాబోయే భర్తను చంపినందుకుగాను సైన్యంలో పనిచేస్తోన్న ఓ జవాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్ లో చోటుచేసుకొంది.
శివాని శర్మ అనే యువతికి కొంత కాలం క్రితం ఆర్మీ జవాన్ కమల్ దేవ్ తో ప్రేమలో పడింది.చాలా కాలం పాటు వారిద్దరూ పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.అయితే ఎట్టకేలకు వారి వ్యవహరం పెద్దలకు తెలిసిపోయింది.
అయితే వారి పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో వివాహం చేసుకోకుండానే వారు విడిపోయారు.కొంతకాలానికి శివానికి నీరజ్ కుమార్ తో తల్లిదండ్రులు వివాహన్ని నిశ్చయించారు.
శివాని, నీరజ్ లు ఆధివారం నాడు తమ స్వంత గ్రామమైన ఉనా నుండి నాలాగడ్ వెళ్ళడానికి బస్సులో బయల్దేరారు. కమల్ దేవ్ వారిని వెంబడించారు. ఇబ్బందులకు గురిచేశారు.వారిద్దరూ పంజాబ్ లోని రూప్ నగర్ లో బస్సు దిగగానే కమల్ దేవ్ కిరాతకానికి పాల్పడ్డాడు.
పంజాబ్ లోని రూప్ నగర్ లోని శివానీ, నీరజ్ లు బస్సు దిగగానే కమల్ దేవ్ వారిద్దరిపై ఆయుధంపై దాడి చేశాడు. నీరజ్ మెడకు తీవ్ర గాయాలయ్యాయి.అతణ్ణి ఆసుపత్రికి తరలించే లోపుగా ఆయన చనిపోయాడు. శివాని తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు కమల్ దేవ్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు.నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.