ఎయిమ్స్ ఆసుపత్రిలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, పత్రికా ప్రకటన !
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆపత్రికి తరలించారు. రెగ్యులర్ చెకప్ కోసమే వాజ్ పేయినికి ఎయిమ్స్ కు తరలించామని ఆయన కార్యదర్శి మహేంద్ర పాండే సోమవారం ఒక పత్రికా ప్రకటన విదుదల చేశారు.
ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలోని ప్రత్యేక బృందం వాజ్ పేయికి చికిత్ర అందిస్తున్నారని ఆయన కార్యదర్శి మహేంద్ర పాండే ఒక పత్రికా ప్రకటన విదుదల చేశారు. అటల్ బీహారీ వాజ్ పేయి దాదాపు 40 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించారు.
కాంగ్రెసేతర భారత ప్రధానికిగా ఐదేళ్లపాటు పాలించింన వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్ పేయి రికార్డు సృష్టించారు. అనారోగ్యం కారణంగా కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ కార్యక్రమాలకు వాజ్ పేయి దూరం ఉంటున్నారు. వివాద రహహితుడిగా వాజ్ పేయికి పేరుంది. విషయం తెలుసుకున్న పలువురు బీజేపీ నాయకులు ఎయిమ్స్ చేరుకుని మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆరోగ్యం గురించి ఆరాతీస్తున్నారు.