మరింత క్షిణించిన అరుణ్ జైట్లి ఆరోగ్యం.. ఎయిమ్స్కు చేరుకున్న నితీష్ కుమార్
గత కొద్ది రోజులుగా ఆనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పోందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో ఆయన్ను వెంటిలెటర్ మీద ఉంచారు. దీంతో పలువురు రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యలంనే బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్, భాజపా నేత సతీశ్ ఉపాధ్యాయ్, కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వి, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్ఫోర్స్ చీఫ్ బీరేంద్ర సింగ్లు అసుపత్రికి చేరుకున్నారు.
శ్వాసకోశ వ్యాధితో ఇబ్బందికిగురవుతున్న అరుణ్ జైట్లి ఆగస్టు 9న ఎయిమ్స్లో చికిత్స పోందుతున్నారు. కాగా అంతకుముందు కొద్ది నెలల నుండి ఆనారోగ్య కారణలతో చికిత్స పోందుతున్నారు. గత శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఎయిమ్స్ వైద్యులు పరిస్థతి బాగానే ఉందని చెప్పారు. ఇక గత వారం నుండి ఎలాంటీ హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఈ దీంతో గతవారమే అరుణ్ జైట్లిని ప్రధాని మోడీతోపాటు పలువురు పార్టీ నేతలు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అరుణ్జైట్లి అనారోగ్యం కారణంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయలేదు. కాగా గత ప్రభుత్వంలోనే ఆర్ధికమంత్రిగా ఉన్న జైట్లి అనారోగ్యం కారణంగా పియుష్ గోయల్ కొన్ని రోజులు బాధ్యతలు చేపట్టారు. అనంతరం తిరిగి గత ఆగస్టు నుండి మంత్రిత్వ బాధ్యతలు స్వికరించారు. ఆ సమయంలో ఆయన అమెరికా వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు. తిరిగి భారత్కు వచ్చి అదే చికిత్సను కొనసాగిస్తున్న జైట్లీ.. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు.